Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- నకిలీ ట్రక్ షీట్లతో రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల గోల్మాల్
- గోదాం మేనేజర్, సూపర్వైజర్ సహా ఆరుగురు అరెస్ట్
- రూ.14 లక్షల నగదు స్వాధీనం.. రూ.46 లక్షల ఖాతాలు ఫ్రీజ్
- రైస్ మిల్లుల పాత్రపై లోతైన దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sircilla Paddy Scam: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జరిగిన ఒక భారీ కుంభకోణాన్ని జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నకిలీ రికార్డులతో ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్న ఒక అంతర్ జిల్లా ముఠా గుట్టును రట్టు చేసి, అందులోని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మీడియాకు వెల్లడించారు.
రూ. 91 లక్షల ప్రభుత్వ నిధుల మాయం
నిందితులు నకిలీ ట్రక్ షీట్లను సృష్టించి, వాటిని సివిల్ సప్లైస్ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ విధంగా తప్పుడు రికార్డులను చూపిస్తూ సుమారు రూ. 91 లక్షల ప్రభుత్వ సొమ్మును కాజేశారు. అంతేకాకుండా, కొనుగోలు కేంద్రాల నుండి గోదాంకు వచ్చిన ధాన్యాన్ని కేవలం రికార్డుల్లో మాత్రమే చూపిస్తూ, వాస్తవానికి ఆ ధాన్యాన్ని ప్రైవేట్ రైస్ మిల్లులకు అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
Also Read
- Viral Divorce: పెళ్లి కోసం వయసు తగ్గించి చెప్పిన భర్త.. కోర్టుకు వెళ్లి విడాకులు తెచ్చుకున్న భార్య..
- Ration Card: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటికి రేషన్ కార్డు జారీ.. MRO ఏమన్నారంటే..
- Narahari Rao : బ్యాంక్ లాకర్ తెరిస్తే షాక్.. నరహరి దాచిన నోట్ల కట్టలు, కిలోల బంగారం.!
- Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
ప్రధాన సూత్రధారులు , నిందితుల అరెస్ట్
ఈ భారీ స్కామ్లో పెద్దూర్ అపెరల్ పార్క్ గోదాం మేనేజర్ ఉత్కం విజయ్, అలాగే సూపర్వైజర్ వాసాల గణేష్ ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు ఈ అంతర్ జిల్లా ముఠాకు చెందిన మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నగదు స్వాధీనం.. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
నిందితుల నుండి పోలీసులు రూ. 14 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 46 లక్షల నిధులను ఏజెన్సీలు ఫ్రీజ్ చేశాయి. మిగిలిన రికవరీ కోసం , అక్రమ ఆస్తుల వివరాల కోసం పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
సివిల్ సప్లై మేనేజర్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో, అలాగే రైస్ మిల్లుల యజమానుల పాత్రపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
-
Meloni-Trump: ముందు మీ ప్రజాదరణ చూసుకోండి.. ట్రంప్పై మరోసారి మెలోని తీవ్ర ఆగ్రహం
-
Fathers Day: వెన్నుతట్టి నడిపించే ధైర్యం ‘నాన్న’.. ఫాదర్స్ డే (జూన్ 21) సందర్భంగా బెస్ట్ కొటేషన్స్ మీ కోసం..
-
IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్స్వీప్ చేసిన టీమిండియా..
-
Iran vs US: హర్మూజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!