Komuravelli Mallanna Jatara 2025: నేటి నుంచి కొమురవెళ్లి మల్లన్న జాతర..
- నేటి నుంచి కొమురవెళ్లి మల్లన్న జాతర..
- రెండు నెలల పాటు జరగనున్న స్వామివారి ఉత్సవాలు..
- మొదటి ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం
Komuravelli Mallanna Jatara 2025: కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి జాతర ఈరోజు (జనవరి 19) నుంచి ప్రారంభం కానుంది. అయితే, సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగియనుంది. సుమారు రెండున్నర నెలల పాటు ఈ జాతర జరుగుతుంది. ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు కొనసాగిస్తారు. బోనాలతో భక్తులు ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేథ్యం సమర్పించనున్నారు. ఇక, పట్నం వేసి కల్యాణం జరిపించి తమ మొక్కులు తీర్చుకుంటారు. వీటిలో నాలుగు ప్రధాన ఘట్టాలతో పాటు మరో రెండు వేడుకలు కూడా జరుపుతారు.
Read Also: Nigeria Petrol Tanker Explosion: నైజీరియాలో ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. 70 మంది మృతి
Also Read
- Duddilla Sridharbabu : సిద్దిపేట రైతులకు 'గడ్డి'తోనే గల్లా నిండా డబ్బు..
- Bengaluru: బెంగళూరులో తెలంగాణ సాఫ్ట్వేర్ జంట ఆత్మహత్య.. కారణమిదేనా?
- Tiger Tension: నంగునూరు మండలం ఘనపూర్ శివారులో పశువులపై పెద్దపులి దాడి
- Congress vs BRS Clash: పొట్టు పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతలు.. సిద్ధిపేటలో హైటెన్షన్!
అయితే, ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఇక, వీరిలో హైదరాబాద్కు చెందిన భక్తులే అత్యధికంగా ఉంటారు. అందుకే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తుంటారు. అలాగే, సోమవారం తోటబావి సమీపంలోని కల్యాణ వేదిక దగ్గర సొంత ఖర్చులతో పట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు జరుపుతారు. ఈ వేడుకకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Bank Account: బ్యాంకు అకౌంట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈ పని చేయకపోతే నష్టపోతారు!
ఇక, జాతర ముగింపు సందర్భంగా జరిగే అగ్నిగుండం కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సారి మార్చి 23వ తేదీన రాత్రి దీన్ని నిర్వహించనున్నారు. భక్తులు రాత్రంతా జాగరణ చేసి.. కల్యాణ వేదిక దగ్గర అగ్నిగుండాలను ఏర్పాటు నిర్వహిస్తారు. 64 రోజుల పాటు సాగే ఈ జాతరకు సుమారు 25 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని ఆలయ ఈవో కురుమ రామాంజనేయులు వెల్లడించారు.
Read Also: Nigeria Petrol Tanker Explosion: నైజీరియాలో ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. 70 మంది మృతి
కాగా, ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం పెద్ద పట్నం అన్నమాట. ఈ సారి ఫిబ్రవరి 2వ తేదీన అర్ధరాత్రి దీన్ని నిర్వహించబోతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం తరఫున నిర్వహించే ఈ కార్యక్రమం జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చౌదరీలు, ఒగ్గుపూజారుల ఆధ్వర్యంలో పంచరంగుల చూర్ణంతో 50 గజాల వైశాల్యంలో పట్నాలు వేయనున్నారు. దీనికి దాదాపు 3 గంటలకు పైగా టైం పడుతుంది. మల్లన స్వామి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి పట్నంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. ముందుగా అర్చకులు పెద్దపట్నం దాటిన తర్వాత భక్తులు దాటి గర్భాలయంలోని స్వామివారి దర్శనం చేసుకుంటారు.
తాజావార్తలు
-
SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్తోనే కాదు.. ఫ్లోర్పై డాన్స్తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?