Siddipet: కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదుగురు గల్లంతు.. ఘటనపై సీఎం ఆరా
- కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదుగురు గల్లంతు
- ప్రాజెక్టులో సెల్ఫీ దిగడానికి వెళ్లిన ఏడుగురు యువకులు
- ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు యువకులు
- గల్లంతైన యువకులు హైదరాబాద్ నుంచి వచ్చినట్లు గుర్తింపు
- కొండపోచమ్మ ప్రాజెక్టులో యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ ఆరా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. సంక్రాంతి సెలవులు కావడంతో సరదాగా స్నేహితులు కలిసి కొండపోచమ్మ ప్రాజెక్టు చూసేందుకు వెళ్లారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు కొండపోచమ్మ ప్రాజెక్టు చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ప్రాజెక్టు దగ్గర సెల్ఫీ దిగడానికి వెళ్లి ఫోటోలు దిగుతూ ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.
Read Also: Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్రాజు క్షమాపణలు..
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. క్షేమంగా బయటపడ్డ యువకులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీంతో.. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. గజ ఈతగాళ్ల సాయంతో ఐదుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈత రాకపోవడంతో ఒకరి చేయి పట్టుకుని మరొకరు డ్యామ్ లోకి దిగారు. ప్రాజెక్టు లోపల మునిగిపోతుండగా భయతో ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకోవడంతో యువకులు నీటిలో మునిగిపోయారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే ఉన్నట్లు గుర్తించారు. గల్లంతైన యువకులలో ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా ఉన్నారు.
Read Also: Sankranthi Rush: పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ
కొండపోచమ్మ ప్రాజెక్టులో యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గల్లంతైన వారికోసం గజ ఈత గాళ్లను రప్పించాలని తెలిపారు. జిల్లా అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..