Fire Accident: సిద్దిపేట సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం.. నిలిచిన విద్యుత్ సరఫరా
Fire Accident: సిద్దిపేట విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం కారణంగా సిద్దిపేట పట్టణంతో పాటు పరిసర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లకు కూడా మంటలు వ్యాపించడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్ నుంచి ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Read also: Maharastra : నేటి నుంచి సమ్మెకు దిగనున్న 8000మంది డాక్టర్లు.. నిలిచిపోనున్న వైద్య సేవలు
Also Read
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
- Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు హరీశ్ రావు అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించారు. అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపు చేయకపోవడంతో, మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటింగ్ ఫోమ్ను ఉపయోగించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్కో అధికారులు, సిద్దిపేట విద్యుత్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ అధికారులను హరీశ్ రావు కోరారు. ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
Arvind Kejriwal: పెరిగిన నీటి బిల్లులపై అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చిన ఢిల్లీ సీఎం..
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!