Shamshabad Airport New Look: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కొత్తరూపు
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కొత్త రూపు దిద్దుకుంది. విస్తరణ పనులు పూర్తి కావడంతో నూతన అంతర్జాతీయ టర్మిణల్ ను ప్రారంభించారు అధికారులు. విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దారు. ఇక ఈ రోజు నుండి అంతర్జాతీయ విమానాలు ఈ టర్మినల్ నుండి నడవనున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో మైలురాయికి చేరువైంది. ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు పూర్తికావడంతో నూతన అంతర్జాతీయ టర్మిణల్ ప్రారంభమైంది. సెకండ్ ఫేస్ పనులు ముగింపు దశకు చేరడంతో తుది మెరుగులు దిద్దుతున్నారు జిఎంఆర్ ఆధికారులు.
అంతర్జాతీయ హంగులతో రూపుదిద్దుకున్న రంగురంగుల వాటర్ ఫాల్స్ ప్రయాణికులను ఇట్టే కట్టిపడేస్తున్నాయ్. 2005 లో మూడేళ్ల లక్షంతో మొదలు పెట్టిన జిఎంఆర్ సంస్థ 2008 లోనే కేవలం 30 నెలలో ఎయిర్ పోర్ట్ ను అందుబాటులోకి తేవడం ద్వారా రికార్డ్ సృష్టించింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో 12 మిలియన్ ప్రయాణికుల సామర్ధ్యంతో ఈ ఎయిర్ పోర్ట్ ను నిర్మించారు. సౌత్ ఏషియా లోనే తొలి గ్రీన్ బిల్ట్ ఎయిర్ పోర్ట్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగింది. అయితే 12, మిలియన్ ప్రయాణికుల సామద్యంతో ఎయిర్ పోర్ట్ ను నిర్మించినప్పటికి ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య రెండింతలు దాటింది. దీంతో రెండు సంవత్సరాల క్రితం ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులకు జిఎంఆర్ సంస్థ శ్రీకారం చుట్టింది. 35 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యంతో టర్మినల్ ను విస్తరించారు.
Also Read
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
- BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
Read Also: Srujana: సృజనా తిన్నావారా.. వదిలేస్తున్నావా ఆడియో గుర్తుందా.. ఆ సృజన ఈ అమ్మాయే
ప్రస్తుతం విస్తరణ పనులు ముగియడంతో అంతర్జాతీయ హంగులతో ఎయిర్ పోర్ట్ సర్వాంగ సుందరంగా రుపొందించారు. ప్రయాణికులను ఇట్టే కట్టిపడేసేల నూతన టెర్మినల్ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. నూతన టెర్మినల్ పూర్తి కావడంతో ఈ రోజు దానిని ప్రారంభించారు. ఇక ప్రధాన టెర్మినల్ ద్వారానే విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని జిఎంఆర్ ఆధికారులు తెలిపారు. విమానాశ్రయ దశలవారి విస్తరణలో భాగంగా తాత్కాలికంగా అంతర్జాతీయ టర్మిణల్ ను ముసివేస్తున్నారు. ప్రధాన టెర్మినల్ కు అనుసంధానంగా విస్తరణ పూర్తయ్యాక అక్కడి నుండి సర్వీసులు మళ్ళీ ప్రారంభమౌతాయని తెలిపారు.

అప్పటివరకు దేశియ టర్మినల్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరుగుతాయని ఆధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం ఎస్ వి 750కి అంతర్జాతీయ విమానం భయలుదేరనునట్లు ఆధికారులు వెల్లడించారు. అప్పటి నుండి అంతర్జాతీయ విమానాలు దేశీయ టర్మనల్ నుండి వెళ్ళాలని తెలిపారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. టెర్మినల్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నిర్మాణంతో ఎయిర్ పోర్ట్ రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు ప్రయాణికులు.
Read Also; Karthikeya: కార్తికేయ ‘బెదురులంక 2012’ ప్రీ-లుక్ రిలీజ్
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!