Shamshabad Airport New Look: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కొత్తరూపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కొత్త రూపు దిద్దుకుంది. విస్తరణ పనులు పూర్తి కావడంతో నూతన అంతర్జాతీయ టర్మిణల్ ను ప్రారంభించారు అధికారులు. విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దారు. ఇక ఈ రోజు నుండి అంతర్జాతీయ విమానాలు ఈ టర్మినల్ నుండి నడవనున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో మైలురాయికి చేరువైంది. ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు పూర్తికావడంతో నూతన అంతర్జాతీయ టర్మిణల్ ప్రారంభమైంది. సెకండ్ ఫేస్ పనులు ముగింపు దశకు చేరడంతో తుది మెరుగులు దిద్దుతున్నారు జిఎంఆర్ ఆధికారులు.
అంతర్జాతీయ హంగులతో రూపుదిద్దుకున్న రంగురంగుల వాటర్ ఫాల్స్ ప్రయాణికులను ఇట్టే కట్టిపడేస్తున్నాయ్. 2005 లో మూడేళ్ల లక్షంతో మొదలు పెట్టిన జిఎంఆర్ సంస్థ 2008 లోనే కేవలం 30 నెలలో ఎయిర్ పోర్ట్ ను అందుబాటులోకి తేవడం ద్వారా రికార్డ్ సృష్టించింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో 12 మిలియన్ ప్రయాణికుల సామర్ధ్యంతో ఈ ఎయిర్ పోర్ట్ ను నిర్మించారు. సౌత్ ఏషియా లోనే తొలి గ్రీన్ బిల్ట్ ఎయిర్ పోర్ట్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగింది. అయితే 12, మిలియన్ ప్రయాణికుల సామద్యంతో ఎయిర్ పోర్ట్ ను నిర్మించినప్పటికి ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య రెండింతలు దాటింది. దీంతో రెండు సంవత్సరాల క్రితం ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులకు జిఎంఆర్ సంస్థ శ్రీకారం చుట్టింది. 35 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యంతో టర్మినల్ ను విస్తరించారు.
Also Read
Read Also: Srujana: సృజనా తిన్నావారా.. వదిలేస్తున్నావా ఆడియో గుర్తుందా.. ఆ సృజన ఈ అమ్మాయే
ప్రస్తుతం విస్తరణ పనులు ముగియడంతో అంతర్జాతీయ హంగులతో ఎయిర్ పోర్ట్ సర్వాంగ సుందరంగా రుపొందించారు. ప్రయాణికులను ఇట్టే కట్టిపడేసేల నూతన టెర్మినల్ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. నూతన టెర్మినల్ పూర్తి కావడంతో ఈ రోజు దానిని ప్రారంభించారు. ఇక ప్రధాన టెర్మినల్ ద్వారానే విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని జిఎంఆర్ ఆధికారులు తెలిపారు. విమానాశ్రయ దశలవారి విస్తరణలో భాగంగా తాత్కాలికంగా అంతర్జాతీయ టర్మిణల్ ను ముసివేస్తున్నారు. ప్రధాన టెర్మినల్ కు అనుసంధానంగా విస్తరణ పూర్తయ్యాక అక్కడి నుండి సర్వీసులు మళ్ళీ ప్రారంభమౌతాయని తెలిపారు.

అప్పటివరకు దేశియ టర్మినల్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరుగుతాయని ఆధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం ఎస్ వి 750కి అంతర్జాతీయ విమానం భయలుదేరనునట్లు ఆధికారులు వెల్లడించారు. అప్పటి నుండి అంతర్జాతీయ విమానాలు దేశీయ టర్మనల్ నుండి వెళ్ళాలని తెలిపారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. టెర్మినల్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నిర్మాణంతో ఎయిర్ పోర్ట్ రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు ప్రయాణికులు.
Read Also; Karthikeya: కార్తికేయ ‘బెదురులంక 2012’ ప్రీ-లుక్ రిలీజ్
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!