MLC Kavitha: రాజకీయ టూరిస్టులకు స్వాగతం.. హైదరాబాద్ బిర్యానీ తిని వెళ్లండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: బీజేపీతో కుదిరిన అవగాహన వల్లే సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు ఏడాది కాలంగా ముందుకు సాగడం లేదని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ఏమైంది? కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అవగాహనను బయటపెట్టాలని కవిత డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు వచ్చే రాజకీయ పర్యాటకులకు స్వాగతం పలుకుతూ కవిత ప్రసంగించారు. హైదరాబాద్ బిర్యానీ తిని సంతోషంగా వెళ్లండి అంటూ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లపై ఏడాదిన్నరగా ఈడీ దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. ఏడాదిన్నర క్రితమే సోనియా, రాహుల్, ఖర్గే, పవన్ బన్సల్, తెలుగు రాష్ట్రాల నేతలను ఈడీ ప్రశ్నించిందని.. ఆ తర్వాత ఏం జరిగింది? బీజేపీతో అవగాహన వల్లే కాంగ్రెస్ నేతలను ఈడీ విచారణకు పిలవడం లేదా..? అంటూ కవిత ప్రశ్నించారు.
Read also: Sweet Corn: శవాలను కాల్చేసిన బొగ్గులతో మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారా ?
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అవగాహనను బయటపెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానంతో కాంగ్రెస్ పార్టీ బహుళ వైఖరి అవలంభిస్తోందని కవిత మండిపడ్డారు. ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని, మరో రాష్ట్రంలో అదే పార్టీలను వ్యతిరేకిస్తున్నారని దుయ్య బట్టారు. ఒక ప్రాంతంలో ఆప్ తో పోరాడుతూనే మరో ప్రాంతంలో అదే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లు అదానీకి రెడ్ కార్పెట్తో స్వాగతం పలికాయని, అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం వ్యతిరేకిస్తున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత, ద్వంద్వ విధానాలను ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. దయచేసి ఈ రాజకీయ గందరగోళం వంటి అంశాలపై ఈ దేశానికి స్పష్టత ఇవ్వండి అన్నారు. మీరు ప్రజల నుండి ఏమి ఆశిస్తున్నారు? BRS మొదటి రోజు నుండి స్పష్టంగా ఉంది. మేము కాంగ్రెస్, BJP రెండింటికీ వ్యతిరేకమన్నారు. అందుకే మేము ఏ కూటమిలోనూ భాగం కాదని స్పష్టం చేశారు. కానీ ఏమిటి కాంగ్రెస్ స్టాండ్ ఇదేనా? అని ప్రశ్నించారు.
NavIC: ఐఫోన్15లో NavIC టెక్నాలజీ.. ఈ ఇస్రో టెక్నాలజీ ఏంటో తెలుసా..?
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!