Raja Singh: నా మెంటాలిటీకి బీజేపీనే కరెక్ట్.. ఏ పార్టీ సూట్ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh: తెలంగాణ బీజేపీ అధిష్టానం తీరుతో విసిగిపోయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సంచలనంగా మారాయి. అయితే రాజా సింగ్ బీజేపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ఇటీవల వస్తున్న వదంతులపై శనివారం ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రాజాసింగ్ కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ నుండే గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నా మెంటాలిటీ కి బీజేపీ తప్ప ఏ పార్టీ లు షూట్ కావు… ఎవరు తీసుకోరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి వెళ్ళలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నా మీద సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తెస్తారో తెలియదన్నారు. బండి సంజయ్, కేంద్ర మంత్రులు ,బీజేపీ నేతలు నా వెనుక ఉన్నారని రాజాసింగ్ తెలిపారు.
Read also: Rains In Hyderabad: నదుల్లా రోడ్లు.. భారీ వర్షానికి నీట మునిగిన భాగ్యనగరం..
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
స్టాండ్-అప్ కామెడీ షోకు వ్యతిరేకంగా, రాజాసింగ్… ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలను కలిగి ఉన్న వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు అతడిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు తరలించారు. రాజా సింగ్ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆరు నెలలకు పైగా దాటింది. బీజేపీ నాయకత్వం తనపై నిషేధాన్ని ఎత్తివేస్తుందని రాజా సింగ్ ఎక్కడో ఆశించారు కానీ అది జరగలేదు. ఏకంగా టీ-బీజేపీ నాయకత్వంతో, బండి సంజయ్తో విభేదాలు వచ్చాయి. వీటన్నింటితో కలత చెందిన రాజా సింగ్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని వార్తలు సంచలనంగా మారాయి.
రాజా సింగ్ తన తొలినాళ్లలో తనకు రాజకీయ అవకాశం కల్పించిన తెలుగుదేశం వైపు చూశారు. 2009 నుంచి 2014 వరకు టీడీపీ కార్పొరేటర్గా ఉన్న రాజాసింగ్ 2014లో బీజేపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో బీజేపీ నుంచి తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. విధేయులు మారడం కోసం, రెండు రోజుల క్రితం, రాజా సింగ్ తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్తో సమావేశమై అవకాశాలపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ఘోషామహల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ సాధించాలనే తపనతో తన నియోజకవర్గం టిక్కెట్ను కోరినట్లు, దీంతో పాటు కనీసం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనైనా టీడీపీ గెలుపు బాధ్యతను తానే తీసుకుంటానని రాజాసింగ్ హామీ ఇచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఓ కీలక నేత చర్చలు జరిపారని, పరిస్థితులు కుదిరితే వచ్చే వారం రాజాసింగ్ టీడీపీలో చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే శనివారం రాజాసింగ్ మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
Nora Fatehi: నోరా నువ్వు డ్రస్ వేసుకున్నావా? అలా చూపిస్తే ఎలా?
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..