Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Sensational Comments Of Clp Leader Bhattivikramamarka On Brs Government

Bhatti Vikramarka: ప్రభుత్వం మెడలు వంచి.. మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను

Published Date :November 4, 2023 , 1:41 pm
By Bhanu
Bhatti Vikramarka: ప్రభుత్వం మెడలు వంచి.. మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhatti Vikramarka: ప్రభుత్వం మెడలు వంచి మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ముదిగొండ మండలం యడవెల్లి గ్రామంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే ప్రజల తెలంగాణ గెలువాలన్నారు. తెలంగాణ ప్రజల కలలను కల్లలుగా చేసిన బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి ప్రజల ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్ర సంపద ప్రజలకు పంచుదామన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకులు బాగుపడతాయని రాష్ట్ర ప్రజలు కలలుగన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల కలలు నిజం చేయడానికి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి అడ్డంగా నిలబడిన దొరలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పాలకులు ప్రజల సంపదను లూటీ చేయడంతో ఎలాంటి మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రజల ప్రభుత్వం గెలవాలని చెప్పారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టులు, ఇండ్లు, ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక సార్ధకత వచ్చి ఉండేదన్నారు.

రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడం, భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని.. మహిళలకు 500 రూపాయలకే సిలిండర్, ప్రతినెల మహిళలకు 2,500 వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇవన్నీ కలిపి నెలకు 5000 రూపాయల వరకు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ప్రకటించిందని గుర్తుచేశారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. చదువుకునే యువతకు ఐదు లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్స్ వరకు ఉచితంగా కరెంటు అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రజల సంపదను దోపిడీ చేశారు కాబట్టే.. ఇలాంటి పథకాలను అమలు చేయలేకపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రజల సంపద ప్రజలకే ఖర్చు పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో దోపిడీ ఉండదు. నిధుల మిగులు ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు తీసుకురావడానికి రాబడిని ఎక్కడి నుంచి తీసుకురావాలో మాకు తెలుసన్నారు.

Also Read

  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!

రైతులకు రుణమాఫీ తో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించిన డిక్లరేషన్స్ మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేస్తామన్నారు. దాచుకొని దోచుకునే బిఆర్ఎస్ పాలకుల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు తెలంగాణ అన్నారు. సమాజం నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ వికాసం జరుగుతుందన్నారు. యడవెల్లి గ్రామానికి కాంగ్రెస్ ఏమి చేయలేదని బిఆర్ఎస్ నాయకులు మాట్లాడడం వారి అవగాహన రాహిత్యం అన్నారు. పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక్క అభివృద్ధి చేసిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే యడవల్లి అభివృద్ధి చెందిందన్నారు. మాయ మాటలు చెప్పి ఓట్లు పొందడం తప్ప మధిర నియోజకవర్గానికి బిఆర్ఎస్ చేసింది ఏమీ లేదన్నారు. మధిర ప్రజలు వేసిన ఓట్ల వల్ల సిఎల్పీ లీడర్ అయ్యాను. రాష్ట్రంలో 1365 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని తెలిపారు. మధిర నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనం, ప్రజలు ఇచ్చిన బలంతో పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని తీర్చ దాంట్లో కీలకంగా ఉండబోతున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించే పాలించే వాడిగానైనా.. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాడిగానైన ఉండాలి.

ఈ రెండు లేని వాళ్ళు ఇక్కడ ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధుల గురించి లెక్కలు తీసి ప్రభుత్వాన్ని నిలదీసి, దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో పోరాడితే వచ్చింది దళిత బంధు పథకం అన్నారు. ప్రశ్నించే వాడిగా ప్రభుత్వం మెడలు వంచి మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మధిర నియోజకవర్గాన్ని ఎప్పుడు పతాక శీర్షికలో ఉంచాను. మధిర పౌరుషం, గౌరవాన్ని ఎక్కడ తగ్గించలేదని తెలిపారు. ఓటు వేసి గెలిపించిన మధిర ప్రజల గౌరవాన్ని మరింత పెంచుతా అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే విధంగా పనిచేస్తాను. ప్రజల సంపద ప్రజలకు అందే విధంగా పనిచేస్తా అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మల్లి అధికారంలోకి వస్తుంది. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన యడవెల్లి గ్రామ అభివృద్ధి రూపు రేఖలు మారుస్తామన్నారు. మేడిపల్లి గ్రామానికి చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పార్టీ శ్రేణులుఘనంగా స్వాగతం పలికారు. డప్పుల దరువులు, పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. దారి పొడవునా భట్టి విక్రమార్క పై బంతిపూల వర్షం కురిపిస్తూ అభిమానం చాటుకున్నారు. మేడిపల్లి గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీలో మహిళలు, యువకులు, రైతులు పాల్గొన్నారు.
Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Government
  • CLP leader Bhattivikramamarka
  • cm kcr
  • Sensational comments of CLP leader Bhattivikramamarka

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..

  • West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్‌కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్‌లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions