Dr K Laxman: కాంగ్రెస్ ని నమ్మి మోసపోవడనికి ప్రజలు సిద్ధంగా లేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: ప్రజలు మాత్రం మరోసారి కాంగ్రెస్ ని నమ్మి మోసపోవడనికి సిద్ధంగా లేరని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరును ఆయన ఖండించారు. గతంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ అవలంబించిన విధానాన్నే రేవంత్ రెడ్డి ఇప్పుడు కొనసాగిస్తున్నాడని తెలిపారు. వేరొక పార్టీ బీ ఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యే లను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని మండిపడ్డారు. గతంలో స్వయంగా రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేసిన వారిని కూడా తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Love Mouli Navdeep: శుభలేఖ షేర్ చేసి పెళ్లి ముహుర్తం ఫిక్స్ అంటున్న నవదీప్.. వధువు ఎవరంటే..?!
Also Read
అప్పుడు అవినీతి పరులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు సుద్ధ పూసలయ్యారా..? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరుతున్న వారు కేసీఆర్ కి అత్యంత సన్నిహితులు, ఆ పార్టీ లో ముఖ్య నేతలే అని తెలిపారు. అలాంటి వారు కాంగ్రెస్ లో చేరడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఆరు గ్యారెంటీ ల విషయంలో కాంగ్రెస్ చేతిలో మోసపోయామని రాష్ట్ర ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. అందుకే ఎలాగైనా ఎంపీ స్థానాలు గెలిచేందుకు కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నారు. కానీ ప్రజలు మాత్రం మరోసారి కాంగ్రెస్ ని నమ్మి మోసపోవడనికి సిద్ధంగా లేరని తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తుందన్నారు.
Astrology: మార్చి 31, ఆదివారం దినఫలాలు
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!