MLA Seethakka : డమ్మీ మంత్రులెవరో ప్రజలకు తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర పాలనలో లేని దుర్మార్గం టీఆర్ఎస్ పాలనలో నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హనుమకొండ డీసీసీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాహుల్ రాకతో కేసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. రాహుల్ పర్యటనపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రిపోర్ట్ తో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందన్నారు. కేసిఆర్, కేటీఆర్ లు ఎలక్షన్ టూరిస్ట్ లు అంటూ కౌంటర్ ఇచ్చారు సీతక్క. ఎన్ని అడ్డంకులు పెట్టినా సభ విజయవంతమైందని సీతక్క అన్నారు.
రాహుల్ గాంధీ డమ్మీ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సీతక్క్. డమ్మీలెవరో, డమ్మీ మంత్రులెవరో అందరికీ తెలుసున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మంత్రికైనా స్వేచ్ఛ ఉందా..? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని రాహుల్ గాంధీ మాట్లాడితే.. స్క్రిప్టు అంటారా అంటూ మండిపడ్డారామె. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలవే డ్రామాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకుని, త్యాగం చేశారని చెప్పారు. ‘మీరు ముఖ్యమంత్రి కాకుండానే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు’ అంటూ మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. ఆంధ్రా నాయకుల పాలనలో కూడా ఇప్పుడున్న పరిస్థితులు లేవన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటే అన్నారు. రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ నాయకుల విమర్శలు హాస్యాస్పదం, అర్థరహితమన్నారు సీతక్క.
ఎన్నికల కోసమే కేసిఆర్, కేటీఆర్ పర్యటనలు చేస్తారని అన్నారు. దేశంలో రైతుల దీక్షకు సంపూర్ణ మద్దతు, భరోసా ఇచ్చింది రాహుల్ గాంధీ అని గుర్తు చేశారు. కానీ బీజేపీతో కలిసి టీఆర్ఎస్ రైతుల ఉసురు తీసిందని మండి పడ్డారు. ఉద్యమంలో లేని ప్రకాష్ రాజ్ ను అంటే టీఆర్ఎస్ కు పౌరుషం ఎందుకు? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్, ఇన్పుట్ సబ్సిడీ కాంగ్రెస్ ఇచ్చినవి కాదా అన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపలేని, టీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ కూడా లేకుండా వరంగల్ ను అభివృద్ధి ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!