MLA Seethakka : డమ్మీ మంత్రులెవరో ప్రజలకు తెలుసు
ఆంధ్ర పాలనలో లేని దుర్మార్గం టీఆర్ఎస్ పాలనలో నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హనుమకొండ డీసీసీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాహుల్ రాకతో కేసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. రాహుల్ పర్యటనపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రిపోర్ట్ తో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందన్నారు. కేసిఆర్, కేటీఆర్ లు ఎలక్షన్ టూరిస్ట్ లు అంటూ కౌంటర్ ఇచ్చారు సీతక్క. ఎన్ని అడ్డంకులు పెట్టినా సభ విజయవంతమైందని సీతక్క అన్నారు.
రాహుల్ గాంధీ డమ్మీ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సీతక్క్. డమ్మీలెవరో, డమ్మీ మంత్రులెవరో అందరికీ తెలుసున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మంత్రికైనా స్వేచ్ఛ ఉందా..? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని రాహుల్ గాంధీ మాట్లాడితే.. స్క్రిప్టు అంటారా అంటూ మండిపడ్డారామె. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలవే డ్రామాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
Also Read
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకుని, త్యాగం చేశారని చెప్పారు. ‘మీరు ముఖ్యమంత్రి కాకుండానే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు’ అంటూ మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. ఆంధ్రా నాయకుల పాలనలో కూడా ఇప్పుడున్న పరిస్థితులు లేవన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటే అన్నారు. రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ నాయకుల విమర్శలు హాస్యాస్పదం, అర్థరహితమన్నారు సీతక్క.
ఎన్నికల కోసమే కేసిఆర్, కేటీఆర్ పర్యటనలు చేస్తారని అన్నారు. దేశంలో రైతుల దీక్షకు సంపూర్ణ మద్దతు, భరోసా ఇచ్చింది రాహుల్ గాంధీ అని గుర్తు చేశారు. కానీ బీజేపీతో కలిసి టీఆర్ఎస్ రైతుల ఉసురు తీసిందని మండి పడ్డారు. ఉద్యమంలో లేని ప్రకాష్ రాజ్ ను అంటే టీఆర్ఎస్ కు పౌరుషం ఎందుకు? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్, ఇన్పుట్ సబ్సిడీ కాంగ్రెస్ ఇచ్చినవి కాదా అన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపలేని, టీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ కూడా లేకుండా వరంగల్ ను అభివృద్ధి ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
తాజావార్తలు
-
Drishyam 3 : చిక్కుల్లో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ దృశ్యం – 3.. రిలీజ్ డౌట్?
-
Depression: యువతను వెంటాడుతున్న డిప్రెషన్.. ఈ సింపుల్ టిప్స్తో మీ మనసుని ప్రశాంతంగా మార్చుకోండి!
-
Amit shah: ‘‘దీదీ ఇంటికెళ్తున్నారు’’.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!