Schools Reopen: ముగిసిన వేసవి సెలవులు.. నేటి నుంచి స్కూళ్లు రీ ఓపెన్..
- నిన్నటితో వేసవి సెలవులు ముగిశాయి
- నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
- మొదటి రోజునే విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- కొత్త ట్రెండ్ను ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Schools Reopen: నిన్నటితో వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే.. మొదటి రోజునే విద్యార్థులకు కొత్త యూనిఫారాలు అందించే కొత్త ట్రెండ్ను రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో యూనిఫారాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ యూనిఫారాల కుట్టు బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగించాలని నిర్ణయించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ సంకల్పం నెరవేర్చి గడువులోగా కుట్టుపనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మహిళా సంఘాలకు కుట్టుపని అప్పగించినప్పటి నుంచి ఎప్పటికప్పుడు అధికారులు, మహిళా సంఘాలను సమన్వయం చేస్తూ గడువులోగా యూనిఫారాలు పాఠశాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
Read also: Astrology: జూన్ 12, బుధవారం దినఫలాలు
Also Read
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
దేశంలోనే తొలిసారిగా విద్యార్థినుల యూనిఫాం కుట్టించే పనిని మహిళా సంఘాలకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. పనులు చేసిన మహిళా సంఘాలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పీఆర్ఆర్డీ, సీఈవో సర్ప్, కలెక్టర్లు, సర్ప్ అధికారులు, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీఓలు ఏపీఎం, సీసీ తదితర అధికారులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీకి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో పరిమిత సంఖ్యలో టైలర్లకు కుట్టించే పనిని అప్పగించడంతో సకాలంలో యూనిఫారాలు అందడం లేదు.
Read also: PM Modi: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు.. కారణమిదే!
ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, టైలర్ల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల ప్రారంభమై మూడు, నాలుగు నెలలైనా విద్యార్థులకు యూనిఫాం అందడం లేదన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను గ్రహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు కుట్టుపని అప్పగించి కుట్టు ఖర్చును 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచి మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సంఘం సభ్యులు, 18 వేల గ్రామ సంఘాలు ఉన్నాయి. వీరికి 15 లక్షల 30 వేల 603 (ఒక జత) యూనిఫాంలు కుట్టించాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఇప్పటి వరకు 90 శాతం యూనిఫాంలు సిద్ధమైన సంగతి తెలిసిందే. రూ. కుట్టుపనితో మహిళా సంఘాలకు ఏటా 50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. భవిష్యత్తులో కూడా మహిళా సంక్షేమ కార్యక్రమాలను అందజేసి మరింత ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Hyderabad: కుటుంబం మొత్తం అదే పని.. పోలీసులు ఏం చేశారంటే..?
తాజావార్తలు
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
-
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Test Match: ఆ ప్లేయర్కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!