సంక్రాంతి పండుగ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంటల పండుగ సంక్రాంతి అందరికీ సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. అన్నివర్గాలను సంక్రాంతి వేడుకలు దగ్గర చేస్తాయని తెలిపారు. సంక్రాంతి శుభసందర్భంగా అందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వాన్ని తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నిరోధించేలా అందరూ కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలకు లోబడే సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలని గవర్నర్ సూచించారు. సంపన్నమైన ఆరోగ్యవంతమైన జీవితం కోసం పొంగల్ 2022 పవిత్రమైన రోజున హృదయం నిండిన ఆనందం మరియు కృతజ్ఞతతో పండుగ జరుపుకుందాం అంటూ గవర్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Wishing all on the auspicious day of #Pongal2022 for a prosperous & healthy life.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) January 13, 2022
Let's celebrate the festival with heart filled happiness and gratitude.
உழவுக்கும் இயற்கைக்கும் நன்றி சொல்லும் பொங்கல் நன்னாளில் அனைவரும் வளமும் நலமும் பெற்று மகிழ்ச்சி பொங்க வாழ வாழ்த்துகிறேன். pic.twitter.com/xGPYWBWY2p