Pathan Cheru: పటాన్చెరు కాంగ్రెస్ ధర్నాలో ఉద్రిక్తత.. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట!
- పటాన్చెరు కాంగ్రెస్ ధర్నాలో ఉద్రిక్తత.. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట..
- ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాట వర్గీయుల యత్నం..
- నిరసనగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pathan Cheru: పఠాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వివాదం కొనసాగుతుంది. పార్టీలోని పాత, కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చింది. సేవ్ కాంగ్రెస్ – సేవ్ పఠాన్ చెరు స్లోగన్స్ తో కార్యకర్తలు, నాయకులు పఠాన్ చెరులోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
Read Also: Harish Rao: కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే.. తల్లికి వచ్చే పెన్షన్ ఆపడం అన్యాయం!
Also Read
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
ఇక, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరుతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పఠాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను సైతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దుర్భాషలాడటంతో ఈ వివాదం మొదలైంది. పార్టీలోని పాత – కొత్త నేతల మధ్య పంచాయితీ సర్దుబాటు చేయాలని హస్తం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి చేరికను మొదటి నుంచి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ వ్యతిరేకిస్తు్న్నారు.
Read Also: Rohit Sharma: అయ్యో రాములా.. మళ్లీ నిరాశపర్చిన రోహిత్!
అయితే, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాట శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గూడెం మహిపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక, 2023లో బీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున టికెట్ ఆశించి భంగపడిన నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేసి థర్డ్ ప్లేస్ లో నిలిచాడు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ లో చేరి మెదక్ ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలోని ఆ ముగ్గురు నేతల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు తరుచు రచ్చకెక్కుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం తల పట్టుకుంటుంది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!