Pathan Cheru: పటాన్చెరు కాంగ్రెస్ ధర్నాలో ఉద్రిక్తత.. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట!
- పటాన్చెరు కాంగ్రెస్ ధర్నాలో ఉద్రిక్తత.. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట..
- ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాట వర్గీయుల యత్నం..
- నిరసనగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pathan Cheru: పఠాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వివాదం కొనసాగుతుంది. పార్టీలోని పాత, కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చింది. సేవ్ కాంగ్రెస్ – సేవ్ పఠాన్ చెరు స్లోగన్స్ తో కార్యకర్తలు, నాయకులు పఠాన్ చెరులోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
Read Also: Harish Rao: కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే.. తల్లికి వచ్చే పెన్షన్ ఆపడం అన్యాయం!
Also Read
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
ఇక, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరుతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పఠాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను సైతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దుర్భాషలాడటంతో ఈ వివాదం మొదలైంది. పార్టీలోని పాత – కొత్త నేతల మధ్య పంచాయితీ సర్దుబాటు చేయాలని హస్తం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి చేరికను మొదటి నుంచి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ వ్యతిరేకిస్తు్న్నారు.
Read Also: Rohit Sharma: అయ్యో రాములా.. మళ్లీ నిరాశపర్చిన రోహిత్!
అయితే, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాట శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గూడెం మహిపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక, 2023లో బీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున టికెట్ ఆశించి భంగపడిన నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేసి థర్డ్ ప్లేస్ లో నిలిచాడు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ లో చేరి మెదక్ ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలోని ఆ ముగ్గురు నేతల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు తరుచు రచ్చకెక్కుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం తల పట్టుకుంటుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!