Pathan Cheru: పటాన్చెరు కాంగ్రెస్ ధర్నాలో ఉద్రిక్తత.. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట!
- పటాన్చెరు కాంగ్రెస్ ధర్నాలో ఉద్రిక్తత.. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట..
- ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాట వర్గీయుల యత్నం..
- నిరసనగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pathan Cheru: పఠాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వివాదం కొనసాగుతుంది. పార్టీలోని పాత, కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చింది. సేవ్ కాంగ్రెస్ – సేవ్ పఠాన్ చెరు స్లోగన్స్ తో కార్యకర్తలు, నాయకులు పఠాన్ చెరులోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
Read Also: Harish Rao: కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే.. తల్లికి వచ్చే పెన్షన్ ఆపడం అన్యాయం!
Also Read
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
ఇక, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరుతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పఠాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను సైతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దుర్భాషలాడటంతో ఈ వివాదం మొదలైంది. పార్టీలోని పాత – కొత్త నేతల మధ్య పంచాయితీ సర్దుబాటు చేయాలని హస్తం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి చేరికను మొదటి నుంచి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ వ్యతిరేకిస్తు్న్నారు.
Read Also: Rohit Sharma: అయ్యో రాములా.. మళ్లీ నిరాశపర్చిన రోహిత్!
అయితే, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాట శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గూడెం మహిపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక, 2023లో బీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున టికెట్ ఆశించి భంగపడిన నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేసి థర్డ్ ప్లేస్ లో నిలిచాడు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ లో చేరి మెదక్ ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలోని ఆ ముగ్గురు నేతల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు తరుచు రచ్చకెక్కుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం తల పట్టుకుంటుంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!