Group 2 Exam: అభ్యర్థుల లగేజ్ కోసం రూ.50 వసూలు.. వెనక్కి ఇచ్చేయాలని కలెక్టర్ ఆదేశం
- NTV వార్త కథనానికి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించారు..
- MNR మెడికల్ కాలేజీకి వెళ్లిన అడిషనల్ కలెక్టర్..
- లగేజ్ కోసం గ్రూప్ 2 అభ్యర్థుల వద్ద తీసుకున్న 50 రూపాయలు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశం..
- మళ్ళీ ఇటువంటి ఘటనలు రిపీట్ కావొద్దని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group 2 Exam: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీజీపీఎస్సీ పోలీసుల సహకారంతో పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మరికొద్ది క్షణాల్లో పరీక్ష ప్రారంభం కానుండగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో వద్ద గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనకు దిగారు.
Read also: Kawasaki: స్పోర్ట్స్ బైక్ వాడే వారికి శుభవార్త.. ఈ బైకుపై భారీ తగ్గింపు
Also Read
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
- JaggaReddy: 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..?
యాజమాన్యం లగేజ్ కౌంటర్ వద్ద ఒక్కో అభ్యర్థి నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తను ఎన్ టీవీలో ప్రసారం చేసింది. దీంతో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. ఎన్టీవీ వార్త కథనాలతో కాలేజీ వద్దకు జిల్లా కలెక్టర్ చేరుకున్నారు. లగేజ్ కోసం గ్రూప్-2 అభ్యర్థుల వద్ద తీసుకున్న రూ.50 వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించారు. మళ్ళీ ఇటువంటి ఘటనలు రిపీట్ కావొద్దని హెచ్చరించారు.
Read also: Eluru Crime: ఏలూరులో దారుణం.. యువకుడిని మందలించిన బాలిక తండ్రి మృతి!
ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ వద్ద అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్ద గ్రూప్-2 అభ్యర్థులు ఇవాళ ఉదయం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. లగేజీ కౌంటర్లో ఒక్కో అభ్యర్థి నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిరుద్యోగ అభ్యర్థులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా సెల్ఫోన్లు, లగేజీలు పెట్టుకునేందుకు రూ.50 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ కళాశాల యాజమాన్యం దురుసుగా సమాధానం చెబుతోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Eluru Crime: ఏలూరులో దారుణం.. యువకుడిని మందలించిన బాలిక తండ్రి మృతి!
ఈ ఘటనపై టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు. పరీక్ష సమయం సమీపించడంతో అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ యాజమాన్యం వద్దకు వెళ్లి హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని వార్నింగ్ ఇచ్చారు.
Beauty Tips: చలికాలంలో మెరిసే చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్లను ట్రై చేయండి..
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం