Rat in Chutney: సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ లో చట్నీలో ఎలుక..
- సంగారెడ్డి జిల్లాలో సుల్తాన్పూర్ JNTU కాలేజీ క్యాంపస్లో చట్నీలో ఎలుక..
- చట్నీ పాత్రపై మూతపెట్టకపోవడంతో అందులో పడ్డ ఎలుక..
- చట్నీలో ఎలుకను చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rat in Chutney: సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ లో చట్నీలో ఎలుక దర్శనమిచ్చింది. దీంతో విద్యార్థులు అందరూ షాక్ అయ్యారు. చట్నీలో ఎలుక అటు ఇటు తిరుగుతూ విద్యార్థులను కాసేపు బెంబేలెత్తించింది. చట్నీ పాత్రపై మూత పెట్టకపోవడంతో ఎలుక చట్నీలో పడి అటు ఇటు పరుగులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎలుకని చూసిన విద్యార్థులు భయబ్రాంతులకు లోనయ్యారు. చట్నీలో వండిన మిరపకాయ, కరివేపాకు లాగానే ఎలుక కూడా కనిపించింది. దీంతో చట్నీ వండిన వారికి అనుమానం రాలేదని తెలుస్తుంది. ఒకవేళ ఆ ఎలుక చట్నీలోనే చనిపోయి వున్నా ఎలుక అని గమనించే విధంగా లేదని విద్యార్థులు చెబుతున్నారు. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ లోనే ఇలా వుంటే మిగతా హాస్టల్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని తెలుపుతున్నారు. ఇలాంటి ఆహారాలు తినే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆహారాలన్నే రోజూ వండి మాకు పెడుతున్నారా? ఇలాంటి ఆహారమే మనం రోజూ తింటున్నామా? అనే ప్రశ్నలు విద్యార్థుల్లో మొదలయ్యాయి. ఇలా సుభ్రత లేకుండా ఆహారం వండటంతో అనారోగ్య బారిన పడవల్సి వస్తుందని వాపోతున్నారు.
Read also: Rajnath Singh: కశ్మీర్లో ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఫైర్
Also Read
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
ఇలాంటి ఘటనలు మన తెలియకుండా యాజమాన్యం మీద భరోసాతో పురుగులు పట్టిన భోజనం రోజూ తింటున్నామా? అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇంత జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటి కైనా యాజమాన్యం స్పందించాదలని కోరుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించాలని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వండే ఆహారాలపై మూతలు పెట్టకుండా వండటం, శుభ్రత లేకుండా వండటంపై ఆరోగ్యశాఖ కఠిన చర్యలు తీసుకోకపోతే విద్యార్థులు అనారోగ్య బారిన పడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛతలేని ఆహారం వండి విద్యార్థలకు అనారోగ్య బారిన పడే అవకాశాలు వున్నాయని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ ను సందర్శించి యాజమాన్యంతో చర్చించి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
India: రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులకు విముక్తి..?
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!