Rajnath Singh: కశ్మీర్లో ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఫైర్
- జమ్ము కశ్మీర్ లో భారత సైన్యంపై ఉగ్రవాదుల దాడి..
- ఈ దాడిలో ఐదుగురు సైనికులు మరణించగా.. మరో ఐదుగురికి గాయాలు..
- ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లా మచెడి ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు మరణించాగా.. మరో ఐదుగురు గాయపడడంతో వారిని పఠాన్కోట్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్తో కాల్పులు జరిపారని అధికారులు చెప్పుకొచ్చారు. కతువా నగరానికి 150 కిలోమీటర్ల దూరంలోని లోహై మల్హర్లోని బద్నోటా గ్రామ సమీపంలోని మాచెడి- కిండ్లీ- మల్హర్ రహదారిపై సైనిక వాహనం సాధారణ పెట్రోలింగ్లో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు.
Read Also: India: రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులకు విముక్తి..?
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
అయితే, ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఐదుగురు జవాన్లు మృతి చెందడం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఈ కష్టకాలంలో దేశం వారికి అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఈ ఉగ్రవాద దాడిలో గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రక్షణ మంత్రి తెలిపారు. ఇక, యాంటీ టెర్రరిజం ఆపరేషన్ కొనసాగుతోంది.. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు భారత ఆర్మీ కట్టుబడి ఉందని రాజ్ నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.
Read Also: Gold Price in Hyderabad: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు!
ఇక, ఈ దాడి తర్వాత ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారు. పోలీసులు, పారామిలటరీ సిబ్బంది సాయంతో సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడి చేసిన వారిని మట్టుబెట్టడానికి అదనపు భద్రతా బలగాలను వెంటనే ఆ ప్రాంతానికి పంపించారు. ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించి ఇండియన్ ఆర్మీ.. వారు ఇటీవల సరిహద్దు దాటి వచ్చారని అనుమానిస్తున్నారు. నిషేధిత జైషే మహ్మద్ (జేఈఎం)తో సంబంధం ఉన్న పాకిస్థాన్కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
I am deeply anguished at the loss of five of our brave Indian Army Soldiers in a terrorist attack in Badnota, Kathua (J&K).
My deepest condolences to the bereaved families, the Nation stands firm with them in this difficult time. The Counter Terrorist operations are underway,…
— Rajnath Singh (@rajnathsingh) July 9, 2024
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!