Rajnath Singh: కశ్మీర్లో ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఫైర్
- జమ్ము కశ్మీర్ లో భారత సైన్యంపై ఉగ్రవాదుల దాడి..
- ఈ దాడిలో ఐదుగురు సైనికులు మరణించగా.. మరో ఐదుగురికి గాయాలు..
- ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లా మచెడి ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు మరణించాగా.. మరో ఐదుగురు గాయపడడంతో వారిని పఠాన్కోట్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్తో కాల్పులు జరిపారని అధికారులు చెప్పుకొచ్చారు. కతువా నగరానికి 150 కిలోమీటర్ల దూరంలోని లోహై మల్హర్లోని బద్నోటా గ్రామ సమీపంలోని మాచెడి- కిండ్లీ- మల్హర్ రహదారిపై సైనిక వాహనం సాధారణ పెట్రోలింగ్లో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు.
Read Also: India: రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులకు విముక్తి..?
Also Read
అయితే, ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఐదుగురు జవాన్లు మృతి చెందడం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఈ కష్టకాలంలో దేశం వారికి అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఈ ఉగ్రవాద దాడిలో గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రక్షణ మంత్రి తెలిపారు. ఇక, యాంటీ టెర్రరిజం ఆపరేషన్ కొనసాగుతోంది.. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు భారత ఆర్మీ కట్టుబడి ఉందని రాజ్ నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.
Read Also: Gold Price in Hyderabad: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు!
ఇక, ఈ దాడి తర్వాత ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారు. పోలీసులు, పారామిలటరీ సిబ్బంది సాయంతో సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడి చేసిన వారిని మట్టుబెట్టడానికి అదనపు భద్రతా బలగాలను వెంటనే ఆ ప్రాంతానికి పంపించారు. ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించి ఇండియన్ ఆర్మీ.. వారు ఇటీవల సరిహద్దు దాటి వచ్చారని అనుమానిస్తున్నారు. నిషేధిత జైషే మహ్మద్ (జేఈఎం)తో సంబంధం ఉన్న పాకిస్థాన్కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
I am deeply anguished at the loss of five of our brave Indian Army Soldiers in a terrorist attack in Badnota, Kathua (J&K).
My deepest condolences to the bereaved families, the Nation stands firm with them in this difficult time. The Counter Terrorist operations are underway,…
— Rajnath Singh (@rajnathsingh) July 9, 2024
తాజావార్తలు
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..