India: రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులకు విముక్తి..?
- త్వరలోనే రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులకు విముక్తి..?
- సుమారు 25 మందిని విడుదల చేయాలని రష్యా నిర్ణయం..
- రష్యా పర్యటనలో ఈ అంశాన్ని పుతిన్ దృష్టికి తీసుకెళ్లిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: రష్యాలో ఉద్యోగాల పేరిట మోసపోయి బలవంతంగా ఆర్మీలో పని చేస్తున్న సుమారు 25 మంది భారతీయులకు విముక్తి దొరకనుంది. వారందరినీ రిలీజ్ చేయాలని రష్యా సర్కార్ నిర్ణయించింది. రెండు రోజుల రష్యా పర్యటన కోసం రాజధాని మాస్కో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో చర్చించినట్లు సమాచారం. మోదీ గౌరవార్థం పుతిన్ సోమవారం రాత్రి ఇచ్చిన ప్రైవేట్ విందులో ఈ విషయాన్ని ప్రధాని లేవనెత్తారని వెల్లడించారు. దీంతో తమ సైన్యంలో పని చేస్తున్న వారందరినీ వెంటనే విడిచిపెట్టి వారు స్వదేశం చేరుకొనే ఏర్పాట్లు చేయాలని రష్యా నిర్ణయించినట్లు టాక్.
Read Also: Mahesh bday special: మహేష్ ఖలేజా చూపిస్తాడా…మురారితో మెప్పిస్తాడా…?
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
ఇక, ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆయన్ను పుతిన్ ఈ విందు సమావేశంలో ప్రశంసించారు. అలాగే, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకోవడం గురించి పుతిన్ ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. అయితే, రష్యాలో ఎక్కువ జీతాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్ల మాటలు నమ్మి సుమారు రెండు డజన్ల మంది అమాయకులు ఏడాది కిందట రష్యాకు వెళ్లారు. కాగా, అక్కడకు వెళ్లాక వారిని ఏజెంట్లు మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించినట్లు పేర్కొన్నారు. దీంతో ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం వారిని సహాయకులుగా జాయిన్ చేసుకుంది. వారికి యూనిఫాంలు, ఆయుధాలు అందించి యుద్ధభూమిలో సైన్యంతో పంపింది.
Read Also: G. Kishan Reddy: నేడు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కల్యాణం.. పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కాగా, ఇప్పటికే ఈ యుద్ధంలో ఇద్దరు భారతీయులు మరణించారు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు యువకులు తమను కాపాడాలంటూ విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మోడీ సర్కార్ స్పందించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. రష్యా అధికారులకు తెలిపింది. తమ దేశ పౌరులను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని కోరింది. అలాగే, అమాయక యువతను తప్పుదోవ పట్టించిన ఏజెంట్లు, సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. రష్యాకు అక్రమంగా భారతీయులను తరలిస్తున్న ఓ ముఠాను దర్యాప్తు సంస్థలు పట్టుకున్నాయి. కనీసం 35 మంది ఇండియన్స్ ను.. బలవంతంగా యుద్ధంలోకి దింపారా లేదా అనే దానిపై విచారణ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..