Sangareddy Crime: సంగారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
- సంగారెడ్డి (మం) కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య..
- చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న 9 తరగతి విద్యార్థిని..
- ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతి(14)గా గుర్తించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Crime: ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి మండలం కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి గురుకుల పాఠశాలలో స్వాతి అనే విద్యార్థిని 9వ తరగతి చదువుకుంటుంది. స్వాతి స్వస్థలం లింగంపల్లి. అయితే ఇవాళ ఉదయం గదిలో నుంచి స్వాతి ఎంతకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు గురుకుల సిబ్బందికి తెలియజేశారు. దీంతో సిబ్బంది వచ్చి చూడగా స్వాతి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. దీంతో గురుకుల సిబ్బంది, వెంటనే పోలీసులకు, స్వాతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు, పోలీసులు చేరుకున్నారు. స్వాతి మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్వాతి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, చంపేశారని ఆరోపించారు. స్వాతి కుటుంబ సభ్యులకు పోలీసులు ఆందోళన విరమించాలని కోరగా న్యాయం జరిగేంత వరకు స్వాతి మృత దేహాన్ని కదలించేది లేదని తేల్చి చెప్పారు.
Read also: Sreeleela : అల్లు అర్జున్ కి అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన శ్రీలీల
Also Read
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
ఈ ఘటనపై సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య మాట్లాడుతూ.. గురుకులంలో ఉదయం ఆరు గంటలకు విద్యార్థిని ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందని అన్నారు. ఘటన సమయంలో హాస్టల్ వార్డెన్ లేదనే విషయం విద్యార్థులు చెబుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థిని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని, స్వాతి ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. విద్యార్థిని కొంచం డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. విద్యార్థిని మృతి కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామన్నారు. స్వాతి గదిలో వెళ్లి ఊరి వేసుకుంది.. అయితే ఆ సమయంలో తోటి విద్యార్థినులు ఎక్కడ వున్నారనే దానిపై ఆరా తీస్తుననారు. హాస్టల్ వార్డెన్ లేదని విద్యార్థినిలు తెలిపారు.. అయితే వార్డెన్ గురుకుల బాధ్యతలు ఎవరికి అప్పగించారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
Allergy: అలర్జీలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తాజావార్తలు
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
-
HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
-
150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
-
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
-
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?