Sangareddy Crime: సంగారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
- సంగారెడ్డి (మం) కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య..
- చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న 9 తరగతి విద్యార్థిని..
- ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతి(14)గా గుర్తించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Crime: ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి మండలం కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి గురుకుల పాఠశాలలో స్వాతి అనే విద్యార్థిని 9వ తరగతి చదువుకుంటుంది. స్వాతి స్వస్థలం లింగంపల్లి. అయితే ఇవాళ ఉదయం గదిలో నుంచి స్వాతి ఎంతకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు గురుకుల సిబ్బందికి తెలియజేశారు. దీంతో సిబ్బంది వచ్చి చూడగా స్వాతి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. దీంతో గురుకుల సిబ్బంది, వెంటనే పోలీసులకు, స్వాతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు, పోలీసులు చేరుకున్నారు. స్వాతి మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్వాతి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, చంపేశారని ఆరోపించారు. స్వాతి కుటుంబ సభ్యులకు పోలీసులు ఆందోళన విరమించాలని కోరగా న్యాయం జరిగేంత వరకు స్వాతి మృత దేహాన్ని కదలించేది లేదని తేల్చి చెప్పారు.
Read also: Sreeleela : అల్లు అర్జున్ కి అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన శ్రీలీల
Also Read
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
ఈ ఘటనపై సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య మాట్లాడుతూ.. గురుకులంలో ఉదయం ఆరు గంటలకు విద్యార్థిని ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందని అన్నారు. ఘటన సమయంలో హాస్టల్ వార్డెన్ లేదనే విషయం విద్యార్థులు చెబుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థిని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని, స్వాతి ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. విద్యార్థిని కొంచం డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. విద్యార్థిని మృతి కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామన్నారు. స్వాతి గదిలో వెళ్లి ఊరి వేసుకుంది.. అయితే ఆ సమయంలో తోటి విద్యార్థినులు ఎక్కడ వున్నారనే దానిపై ఆరా తీస్తుననారు. హాస్టల్ వార్డెన్ లేదని విద్యార్థినిలు తెలిపారు.. అయితే వార్డెన్ గురుకుల బాధ్యతలు ఎవరికి అప్పగించారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
Allergy: అలర్జీలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!