Sangareddy Crime: సంగారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
- సంగారెడ్డి (మం) కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య..
- చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న 9 తరగతి విద్యార్థిని..
- ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతి(14)గా గుర్తించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Crime: ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి మండలం కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి గురుకుల పాఠశాలలో స్వాతి అనే విద్యార్థిని 9వ తరగతి చదువుకుంటుంది. స్వాతి స్వస్థలం లింగంపల్లి. అయితే ఇవాళ ఉదయం గదిలో నుంచి స్వాతి ఎంతకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు గురుకుల సిబ్బందికి తెలియజేశారు. దీంతో సిబ్బంది వచ్చి చూడగా స్వాతి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. దీంతో గురుకుల సిబ్బంది, వెంటనే పోలీసులకు, స్వాతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు, పోలీసులు చేరుకున్నారు. స్వాతి మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్వాతి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, చంపేశారని ఆరోపించారు. స్వాతి కుటుంబ సభ్యులకు పోలీసులు ఆందోళన విరమించాలని కోరగా న్యాయం జరిగేంత వరకు స్వాతి మృత దేహాన్ని కదలించేది లేదని తేల్చి చెప్పారు.
Read also: Sreeleela : అల్లు అర్జున్ కి అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన శ్రీలీల
Also Read
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
ఈ ఘటనపై సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య మాట్లాడుతూ.. గురుకులంలో ఉదయం ఆరు గంటలకు విద్యార్థిని ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందని అన్నారు. ఘటన సమయంలో హాస్టల్ వార్డెన్ లేదనే విషయం విద్యార్థులు చెబుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థిని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని, స్వాతి ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. విద్యార్థిని కొంచం డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. విద్యార్థిని మృతి కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామన్నారు. స్వాతి గదిలో వెళ్లి ఊరి వేసుకుంది.. అయితే ఆ సమయంలో తోటి విద్యార్థినులు ఎక్కడ వున్నారనే దానిపై ఆరా తీస్తుననారు. హాస్టల్ వార్డెన్ లేదని విద్యార్థినిలు తెలిపారు.. అయితే వార్డెన్ గురుకుల బాధ్యతలు ఎవరికి అప్పగించారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
Allergy: అలర్జీలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!