Sandra Venkata Veeraiah: ఏపీ మంత్రి బొత్సకు ఎమ్మెల్యే సండ్ర స్ట్రాంగ్ కౌంటర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandra Venkata Veeraiah Strong Counter To Minister Botsa Satyanarayana: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ విద్యాశాఖ మీద అవగాహన లేకుండా బొత్స మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా చేసుకోవాలో.. ముందు అది చూసుకోండని హితవు పలికారు. పక్క రాష్ట్రం మీద విద్యావ్యవస్థ, ఉద్యోగ నియామకాల మీద అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. బొత్స వ్యక్తిగంతంగా మాట్లాడారా? లేక ఇది ప్రభుత్వ విధానమా? అనేది స్పష్టం చేయాలని కోరారు.
Motkupalli Narasimhulu: నేనేమీ సన్యాసిని కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
తెలంగాణలో సక్రమమైన పద్ధతిలో అన్ని రకాల నియామకాలు చేపట్టి, కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యొగులకు పీఆర్సీలు ఇవ్వాలని ఆలోచించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు. సింగరేణి సంస్థ లాభాల్లో తమ ప్రభుత్వం వాటాలు ఇస్తోందన్నారు. ఆర్టీసీని సైతం తమ ప్రభుత్వం కాపాడిందన్నారు. పారదర్శకంగా ఉద్యోగ నియమకాలు చేసి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరు తప్పు చేశారో ప్రభుత్వమే గుర్తించి వారిని శిక్షిస్తుంటే.. మీరు అవహేళన చేస్తారా? అని బొత్సను ప్రశ్నించారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసవరించుకోవాలి అన్నారు. తప్పుడు ప్రకటనలతో తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసిన మంత్రిపైన ఏపీ సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
BS Rao: బీఎస్ రావు ప్రస్థానం.. అసలు ఎందుకు శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు..
కాగా.. ఆఫ్ర్టాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లోనే ఏ రకంగా స్కామ్లు జరిగాయో చూశామని, అన్ని చూచిరాతలేనని అన్నారు. ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో కూడా వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని.. అందుకే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చకూడదని పేర్కొన్నారు. ఈ విధంగా బొత్స చేసిన వ్యాఖ్యలకు పై విధంగా ఎమ్మెల్యే సండ్ర ఘాటుగా స్పందించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!