Sandra Venkata Veeraiah: ఏపీ మంత్రి బొత్సకు ఎమ్మెల్యే సండ్ర స్ట్రాంగ్ కౌంటర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandra Venkata Veeraiah Strong Counter To Minister Botsa Satyanarayana: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ విద్యాశాఖ మీద అవగాహన లేకుండా బొత్స మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా చేసుకోవాలో.. ముందు అది చూసుకోండని హితవు పలికారు. పక్క రాష్ట్రం మీద విద్యావ్యవస్థ, ఉద్యోగ నియామకాల మీద అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. బొత్స వ్యక్తిగంతంగా మాట్లాడారా? లేక ఇది ప్రభుత్వ విధానమా? అనేది స్పష్టం చేయాలని కోరారు.
Motkupalli Narasimhulu: నేనేమీ సన్యాసిని కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
తెలంగాణలో సక్రమమైన పద్ధతిలో అన్ని రకాల నియామకాలు చేపట్టి, కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యొగులకు పీఆర్సీలు ఇవ్వాలని ఆలోచించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు. సింగరేణి సంస్థ లాభాల్లో తమ ప్రభుత్వం వాటాలు ఇస్తోందన్నారు. ఆర్టీసీని సైతం తమ ప్రభుత్వం కాపాడిందన్నారు. పారదర్శకంగా ఉద్యోగ నియమకాలు చేసి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరు తప్పు చేశారో ప్రభుత్వమే గుర్తించి వారిని శిక్షిస్తుంటే.. మీరు అవహేళన చేస్తారా? అని బొత్సను ప్రశ్నించారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసవరించుకోవాలి అన్నారు. తప్పుడు ప్రకటనలతో తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసిన మంత్రిపైన ఏపీ సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
BS Rao: బీఎస్ రావు ప్రస్థానం.. అసలు ఎందుకు శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు..
కాగా.. ఆఫ్ర్టాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లోనే ఏ రకంగా స్కామ్లు జరిగాయో చూశామని, అన్ని చూచిరాతలేనని అన్నారు. ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో కూడా వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని.. అందుకే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చకూడదని పేర్కొన్నారు. ఈ విధంగా బొత్స చేసిన వ్యాఖ్యలకు పై విధంగా ఎమ్మెల్యే సండ్ర ఘాటుగా స్పందించారు.
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!