తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు వీసీసజ్జనార్. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రానున్న రోజుల్లో వారందరినీ పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకుంటామన్నారు. సంస్థ అభివృద్ధి చెందితే అందరం బాగుంటామని సజ్జనార్ అన్నారు.
Read Also:తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం-గవర్నర్
సంస్థలో పని చేసినన్ని రోజులు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కాగా న్యూఇయర్ రోజు బస్సులో ప్రయాణించే 12ఏళ్లలోపు చిన్నారులకు టిక్కెట్ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. రాష్ర్టంలోని అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని వెల్లడించారు. కాగా ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అనుహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంస్థ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు అటు ప్రజలను ఆర్టీసీలో ప్రయాణం చేసేలా ఆకర్షించేలా చేస్తున్నారు సజ్జనార్.