Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!
- రేపు సాయంత్రం సీఎం రేవంత్ బటన్ నొక్కనున్నారు
- భారీ వర్షాలతో ఖమ్మం సభ రద్దు
- శిల్పకళా వేదిక నుంచే నిధుల విడుదల
- డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bharosa : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని రైతాంగం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం నిధుల విడుదలకు ఎట్టకేలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రమే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను నేరుగా జమ చేయనున్నారు. ఈ వానాకాలం సీజన్లో పెట్టుబడి ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.
ఖమ్మం సభ రద్దు.. హైదరాబాద్కు మారిన వేదిక
అయితే, ఈ నిధుల విడుదల సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం చివరి నిమిషంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మంగళవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భారీ ఎత్తున రైతు బహిరంగ సభ నిర్వహించి, అక్కడి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ, రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో సభ నిర్వహణకు వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. దాంతో రైతులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మధిర రైతు సభను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది.
Also Read
- Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
శిల్పకళా వేదిక నుండి నిధుల విడుదల
మధిరలో బహిరంగ సభ రద్దయినప్పటికీ, నిధుల విడుదలలో రైతులకు ఎలాంటి ఆలస్యం జరగకూడదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా నిశ్చయించారు. ఇందుకోసం ఈ అధికారిక కార్యక్రమాన్ని తక్షణమే హైదరాబాద్కు తరలించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ‘రైతు భరోసా’ సమావేశం ఘనంగా జరగనుంది. ఈ వేదిక నుంచే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి లబ్ధిదారులైన రైతుల అకౌంట్లలోకి నిధులను బదిలీ చేయనున్నారు.
అర్హులైన ప్రతి రైతుకూ లబ్ధి.. అన్నదాతల్లో హర్షం
రైతు భరోసా నూతన మార్గదర్శకాలపై ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేసి, ఎలాంటి అవకతవకలు లేకుండా కేవలం అర్హులైన ప్రతి నిజమైన రైతుకూ ఈ ఆర్థిక సహాయం అందేలా పక్కాగా చర్యలు తీసుకుంది. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కగానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతిలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరడం ప్రారంభమవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!