Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!
- రేపు సాయంత్రం సీఎం రేవంత్ బటన్ నొక్కనున్నారు
- భారీ వర్షాలతో ఖమ్మం సభ రద్దు
- శిల్పకళా వేదిక నుంచే నిధుల విడుదల
- డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bharosa : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని రైతాంగం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం నిధుల విడుదలకు ఎట్టకేలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రమే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను నేరుగా జమ చేయనున్నారు. ఈ వానాకాలం సీజన్లో పెట్టుబడి ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.
ఖమ్మం సభ రద్దు.. హైదరాబాద్కు మారిన వేదిక
అయితే, ఈ నిధుల విడుదల సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం చివరి నిమిషంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మంగళవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భారీ ఎత్తున రైతు బహిరంగ సభ నిర్వహించి, అక్కడి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ, రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో సభ నిర్వహణకు వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. దాంతో రైతులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మధిర రైతు సభను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది.
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
- Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
శిల్పకళా వేదిక నుండి నిధుల విడుదల
మధిరలో బహిరంగ సభ రద్దయినప్పటికీ, నిధుల విడుదలలో రైతులకు ఎలాంటి ఆలస్యం జరగకూడదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా నిశ్చయించారు. ఇందుకోసం ఈ అధికారిక కార్యక్రమాన్ని తక్షణమే హైదరాబాద్కు తరలించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ‘రైతు భరోసా’ సమావేశం ఘనంగా జరగనుంది. ఈ వేదిక నుంచే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి లబ్ధిదారులైన రైతుల అకౌంట్లలోకి నిధులను బదిలీ చేయనున్నారు.
అర్హులైన ప్రతి రైతుకూ లబ్ధి.. అన్నదాతల్లో హర్షం
రైతు భరోసా నూతన మార్గదర్శకాలపై ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేసి, ఎలాంటి అవకతవకలు లేకుండా కేవలం అర్హులైన ప్రతి నిజమైన రైతుకూ ఈ ఆర్థిక సహాయం అందేలా పక్కాగా చర్యలు తీసుకుంది. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కగానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతిలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరడం ప్రారంభమవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!
-
Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
-
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!