Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!
- రేపు సాయంత్రం సీఎం రేవంత్ బటన్ నొక్కనున్నారు
- భారీ వర్షాలతో ఖమ్మం సభ రద్దు
- శిల్పకళా వేదిక నుంచే నిధుల విడుదల
- డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bharosa : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని రైతాంగం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం నిధుల విడుదలకు ఎట్టకేలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రమే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను నేరుగా జమ చేయనున్నారు. ఈ వానాకాలం సీజన్లో పెట్టుబడి ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.
ఖమ్మం సభ రద్దు.. హైదరాబాద్కు మారిన వేదిక
అయితే, ఈ నిధుల విడుదల సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం చివరి నిమిషంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మంగళవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భారీ ఎత్తున రైతు బహిరంగ సభ నిర్వహించి, అక్కడి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ, రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో సభ నిర్వహణకు వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. దాంతో రైతులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మధిర రైతు సభను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
శిల్పకళా వేదిక నుండి నిధుల విడుదల
మధిరలో బహిరంగ సభ రద్దయినప్పటికీ, నిధుల విడుదలలో రైతులకు ఎలాంటి ఆలస్యం జరగకూడదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా నిశ్చయించారు. ఇందుకోసం ఈ అధికారిక కార్యక్రమాన్ని తక్షణమే హైదరాబాద్కు తరలించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ‘రైతు భరోసా’ సమావేశం ఘనంగా జరగనుంది. ఈ వేదిక నుంచే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి లబ్ధిదారులైన రైతుల అకౌంట్లలోకి నిధులను బదిలీ చేయనున్నారు.
అర్హులైన ప్రతి రైతుకూ లబ్ధి.. అన్నదాతల్లో హర్షం
రైతు భరోసా నూతన మార్గదర్శకాలపై ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేసి, ఎలాంటి అవకతవకలు లేకుండా కేవలం అర్హులైన ప్రతి నిజమైన రైతుకూ ఈ ఆర్థిక సహాయం అందేలా పక్కాగా చర్యలు తీసుకుంది. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కగానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతిలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరడం ప్రారంభమవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!