VC Sajjanar: వాళ్ల కోసం స్పెషల్ బస్సులు.. సజ్జనార్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. త్వరలోనే.. 2,375 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ బస్సుల్లో దివ్యాంగుల కోసం కొన్ని స్పెషల్ బస్సులను కేటాయించేలా నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. దివ్యాంగులకు కూడా అనౌన్స్ మెంట్, ఎంక్వైరీ రూం ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం ద్వారా బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని స్థానాల్లో మహిళలే ఉన్నారు. పైగా.. సీట్ల కోసం కొట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో.. మరికొందరి పరిస్థితి స్థిమితంగా మారింది. కాగా, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని పురుషులు కూడా మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబ్బున్న పురుషుల పరిస్థితి ఎలా ఉన్నా వికలాంగులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
Read also: IRR Scam Case: నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
దీనిని పరిగణనలోకి తీసుకున్న టీఎస్ ఆర్టీసీ వారి కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆలోచిస్తోంది. ఈ మేరకు.. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. 45 రోజుల్లోనే 12 కోట్ల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. కానీ ఉచిత ప్రయాణం వల్ల వికలాంగులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూడా కూర్చుంటున్నారని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. త్వరలో 2,375 కొత్త బస్సులను తీసుకువస్తామని.. అప్పుడే కొంత ఊరట లభిస్తుందన్నారు. వికలాంగుల కోసం అవసరమైతే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అంధులకు అడ్వర్టైజింగ్, ఎంక్వైరీ రూం ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు.
Read also: Pune: “క్యారెక్టర్పై అనుమానం”.. మహిళా టెక్కీని చంపేసిన బాయ్ఫ్రెండ్..
తాజావార్తలు
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
-
T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!