VC Sajjanar: వాళ్ల కోసం స్పెషల్ బస్సులు.. సజ్జనార్ కీలక ప్రకటన
VC Sajjanar: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. త్వరలోనే.. 2,375 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ బస్సుల్లో దివ్యాంగుల కోసం కొన్ని స్పెషల్ బస్సులను కేటాయించేలా నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. దివ్యాంగులకు కూడా అనౌన్స్ మెంట్, ఎంక్వైరీ రూం ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం ద్వారా బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని స్థానాల్లో మహిళలే ఉన్నారు. పైగా.. సీట్ల కోసం కొట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో.. మరికొందరి పరిస్థితి స్థిమితంగా మారింది. కాగా, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని పురుషులు కూడా మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబ్బున్న పురుషుల పరిస్థితి ఎలా ఉన్నా వికలాంగులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
Read also: IRR Scam Case: నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
దీనిని పరిగణనలోకి తీసుకున్న టీఎస్ ఆర్టీసీ వారి కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆలోచిస్తోంది. ఈ మేరకు.. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. 45 రోజుల్లోనే 12 కోట్ల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. కానీ ఉచిత ప్రయాణం వల్ల వికలాంగులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూడా కూర్చుంటున్నారని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. త్వరలో 2,375 కొత్త బస్సులను తీసుకువస్తామని.. అప్పుడే కొంత ఊరట లభిస్తుందన్నారు. వికలాంగుల కోసం అవసరమైతే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అంధులకు అడ్వర్టైజింగ్, ఎంక్వైరీ రూం ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు.
Read also: Pune: “క్యారెక్టర్పై అనుమానం”.. మహిళా టెక్కీని చంపేసిన బాయ్ఫ్రెండ్..
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!