VC Sajjanar: వాళ్ల కోసం స్పెషల్ బస్సులు.. సజ్జనార్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. త్వరలోనే.. 2,375 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ బస్సుల్లో దివ్యాంగుల కోసం కొన్ని స్పెషల్ బస్సులను కేటాయించేలా నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. దివ్యాంగులకు కూడా అనౌన్స్ మెంట్, ఎంక్వైరీ రూం ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం ద్వారా బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని స్థానాల్లో మహిళలే ఉన్నారు. పైగా.. సీట్ల కోసం కొట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో.. మరికొందరి పరిస్థితి స్థిమితంగా మారింది. కాగా, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని పురుషులు కూడా మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబ్బున్న పురుషుల పరిస్థితి ఎలా ఉన్నా వికలాంగులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
Read also: IRR Scam Case: నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
Also Read
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
- Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
దీనిని పరిగణనలోకి తీసుకున్న టీఎస్ ఆర్టీసీ వారి కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆలోచిస్తోంది. ఈ మేరకు.. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. 45 రోజుల్లోనే 12 కోట్ల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. కానీ ఉచిత ప్రయాణం వల్ల వికలాంగులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూడా కూర్చుంటున్నారని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. త్వరలో 2,375 కొత్త బస్సులను తీసుకువస్తామని.. అప్పుడే కొంత ఊరట లభిస్తుందన్నారు. వికలాంగుల కోసం అవసరమైతే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అంధులకు అడ్వర్టైజింగ్, ఎంక్వైరీ రూం ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు.
Read also: Pune: “క్యారెక్టర్పై అనుమానం”.. మహిళా టెక్కీని చంపేసిన బాయ్ఫ్రెండ్..
తాజావార్తలు
-
SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!