Rajendra Nagar: బాలాపూర్ లో దారుణం.. రౌడిషీటర్ పై కత్తులతో దాడి.. హత్య
Rajendra Nagar: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రౌడిషీటర్ పై కత్తులతో దాడిచేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్ ను పై కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా చంపారు. అతని మర్మంగాలు కట్ చేసిన దుండగులు వంటిపై అనేక సార్లు పొడిచి అతి దారుణంగ హత్య చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలాపూర్ ప్రాంతంలో ముబారఖ్ సిగార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సామాన్యుడిగా ఉన్న ముబారఖ్ అంచలంచెలుగా ఎదిరి రౌడీషీటర్ గా స్థిరపడ్డాడు. అయితే అతని పై ఎవరికి ఏం అన్యాయం జరిగిందో తెలియదు కానీ.. అతడిపై కక్ష పెంచుకున్న కొందరు దుండగులు తన ఒక్కడు చిక్కేందుకు సమయం వైట్ చేశారు. చివరకు ఆ సమయం రానేవచ్చింది. వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద ముబారఖ్ ఒక్కరు చిక్కాడు. దీంతో దుండగులు ప్లాన్ ప్రకారం అతనిపై ఒక్కసారిగా దాడి చేశారు. విచకనా రహితంగా దాడి చేయడంతో ముబారఖ్ అక్కడికక్కడే కిందికి పడిపోయాడు. అంతే కాకుండా ముబారఖ్ పై కర్కసంగా వ్యవహరించారు. అతని మర్మాంగాని కోయడమే కాకుండా విచక్షణారహితంగా కత్తితో పోడిచారు. ముబారఖ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి హుటా హుటిన క్లూస్ టీ, డాగ్ స్క్వాడ్ తో అక్కడకు చేరుకున్నారు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ముబారఖ్ నిర్జీవ స్థితిలో వుండటంతో షాక్ తిన్నారు. క్రూరాతి క్రూరంగా కత్తులతో దాడిచేడంతోనే ముబారఖ్ మృతి చెందాడని, ఇది గతంలో రౌడీ షీటర్ అని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. హత్యకు గల కారణాలపై విచారణను బాలాపూర్ పోలీసులు ముమ్మరం చేసారు. ముబారఖ్ కు గతంలో ఎవరితో అయినా విరోధం ఉందా? వారే ఈ హత్య చేశారా? లేక కుటుంబంలోని వారే ముబారఖ్ హత్యకు కారకులా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా విరోధం ఉంటే పోలీసుల వరకు తీసుకురావాలని కానీ.. ఇలా మృగాళ్లా మనిషిపై దాడులు చేయడం కరెక్ట్ కాదని పోలీసులు సూచించారు. ముబారఖ్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
Ram Mandir : అయోధ్యకు ఉచిత రైలు.. బిజెపి ప్రభుత్వం కీలక నిర్ణయం
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!