Site icon NTV Telugu

ఎర్రవల్లి నిషేధిత ప్రాంతం కాదు: రేవంత్‌రెడ్డి

రైతులు బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై కోపంగా ఉన్నారని ఇంటెలిజెన్స్‌ రిపోర్టు రావడంతో ఈ రెండు పార్టీలు కొత్త డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇద్దరి ఒప్పందంలో భాగంగానే.. బీజేపీ నిరుద్యోగం అని కొత్త రాగం ఎంచుకుందన్నారు. కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేస్తే… తెలంగాణలో ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఎర్రవల్లి నిషేధిత ప్రాంతం కాదు.. అది పాకిస్తాన్‌ లేదని, దానికి పాస్‌పోర్ట్‌ అవసరం లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

https://ntvtelugu.com/bandi-sanjay-was-highly-critical-of-kcr/

కేసీఆర్‌.. వరి వద్దు అని చెప్పి తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడని రేవంత్‌రెడ్డి విమర్శించారు. వరి విత్తనాలు అమ్మితేనే కేసులు పెడతామన్న కలెక్టర్‌కి కేసీఆర్‌ ప్రమోషన్‌ ఇచ్చాడు. కేసీఆర్‌ వరి విత్తనాలను ఎందుకు సాగు చేశాడో, వ్యవసాయశాఖ మంత్రి, కేసీఆర్‌ ఇద్దరూ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.. తెలంగాణ సమాజం కేసీఆర్‌ను దొంగగా చూడాలన్నారు. మా నాయకులను గొర్రెలా ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేశారు. అర్థరాత్రి నుంచే అరెస్టులు చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.

Exit mobile version