మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారిందనే చెప్పొచ్చు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరటంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో కాంగ్రెస్ కు అడ్డాగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. కలవరం మొదలైంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. హస్తం నుంచి కషాయం జెండా మారినా బీజేపీ నుంచి బ్రాండ్ వ్యాల్యూతో అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికార పార్టీ కూడా మునుగోడులో సత్తా చాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు, సభలతో బలప్రదర్శన చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఆచీతూచీ అడుగులు ముందుకు వేస్తోంది.
ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని ఒడిసిపట్టుకుని ఉనికి చాటుకోవాలనుకుంటోన్న హస్తం పార్టీ, అభ్యర్థి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దీంతో.. ఈ విషయంలో సందిగ్థం వీడకముందే ప్రచారానికి దిగుతోంది. నేటి నుంచి హస్తం మునుగోడు ప్రచారానికి రంగం సిద్దం చేసింది. ఉప ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి మొదలుకానుందని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించింన విషయం తెలిసిందే. మునుగోడు ప్రచారానికి మండల ఇంఛార్జీలు మండలాలు వారీగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తారని నేటి నుంచి గడప, గడప కాంగ్రెస్ అన్న నినాదంతో ప్రచారం నిర్వహిస్తోందని వివరించారు. మూడో తేదీన మునుగోడులో తనతో పాటు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ మీడియతో మాట్లాడతారని రేవంత్ అన్నారు. మునుగోడు ప్రచారంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొలని రేవంత్ పిలుపు నిచ్చారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?