Revanth Reddy : కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలైపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC President Revanth Reddy Made Comments On Telangana Chief Minister K.Chandrashekar Rao.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 10 రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదు అయి గోదావరి ఉదృతం గా ప్రవహిస్తుంది. వర్షకాలం వస్తున్నప్పుడు మే నెలలోనే ఆయా శాఖలతో ,మంత్రులతో సీఎం సమీక్ష చేయాల్సింది.. గతంలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి నిరంతరం ముఖ్యమంత్రులు పర్యవేక్షించేది.. వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్య శాఖ ,డిజాస్టర్ సమయంలో విపత్తు బృందాలను అప్రమత్తం చేసేది.. కేసీఆర్ సమీక్ష చేసినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ను కానీ డిజాస్టర్ బృందాలను ,ఆయా అధికారులను పిలవకుండా పార్టీ ఫిరాయింపులపై సమీక్ష చేసాడు.. పక్క రాష్ట్ర నేతలకు ఫోన్ చేసి జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర పై మాట్లాడాడు.. సింగరేణి ఉద్యోగులు ఇతరులను కాపాడబోయి ఇద్దరు మరణించారు… కనీసం వారికి సంతాపం కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయలేదు.. వరదలు వచ్చే 20 నియోజకవర్గల్లో మీకు ఉన్న మంత్రులను ,ఆయా శాఖ అధికారులను అలెర్ట్ చేయాలని సూచించం.. అవసరాలు తీర్చే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించం.. రీడిజైన్ పేరుతో లక్ష కోట్లకు పైగా ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు.. ఎక్కడికక్కడ మోటార్లు మునిగిపోయాయి… అవి మళ్ళీ పని చేస్తాయని నమ్మకం లేదు.. కోట్లు అవినీతి జరిగింది.. కేసీఆర్ అవినీతి కి కాళేశ్వరం బలైపోయింది..
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
Revanth Reddy On Floods : మానవత్వం లేని వ్యక్తి కేసీఆర్..
వరదలు వచ్చినప్పుడు మోటార్లు మునుగుతాయి అని పెంటారెడ్డి అంటున్నాడు.. మేము నాగార్జున సాగర్, శ్రీశైలం మునిగాయా.. నిపుణుల పేరుతో అవినీతి కి తెరలేపారు.. ప్రజలు కోటుకుపోయి చచ్చిపోతుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు.. బాసర ట్రిపుల్ ఐటీ లో కలుషితమైన తిండి వల్ల 800 మంది బారిన పడ్డారు.. వారిని ఇంత వరకు పరమర్శించలేదు.. ప్రభుత్వ దోపిడీ కి వందలాదిమంది విద్యార్థులు బలవుతున్నారు… ప్రాజెక్టులు మునిగిన ,తెగిన వేల కోట్ల ప్రాజెక్టులు పోయిన పట్టింపు లేదు..11 లక్షల ఎకరాల్లో పంట మునిగిపోయింది.. సర్వేలు అన్ని మీకు సగమే చెబుతున్నాయి..వంద స్థానాల్లో సగం అంటే మీరు సగం సచ్చినట్టే… 18 నెలల తరువాత జరిగే ఎన్నికల మీద ఇప్పుడే మాట్లాడుతున్నావ్.. తెలంగాణ రాష్ట్రాన్ని తండ్రీ కొడుకులు సర్వ నాశనం చేశారు.. నేషనల్ డిజాస్టర్ బృందలను పంపించాలని ప్రధాని కి కాంగ్రెస్ లేఖ రాసింది.. పంట నష్టపరిహారం చెల్లించాలి.
ఇసుక దోపిడీ వల్లే భద్రాచలం మునిగిపోయింది.. వరదలకు కారణం కేసీఆర్ కుటుంబం ఇసుక దోపిడీ వల్లే.. వరదల్లో ప్రజలు,పశువులు ఆస్తులు కొట్టుకుపోతుంటే జాతీయ రాజకీయాల పై సమీక్ష చేస్తున్నారు.. ఈ దరిద్రం ఉన్నంత వరకు తెలంగాణ కు పట్టిన పీడ పోదు.. కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుంది.. జాతీయ విపత్తుగా గుర్తించి తక్షణమే 2 వేల కోట్లు రిలీజ్ చేయాలని మోడీ కి డిమాండ్ చేస్తున్న.. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి తక్షణమే మోడీ దగ్గర జాతీయ విపత్తుగా గుర్తుంచి 2 వేల కోట్లు విడుదల చేపించాలి.. ప్రతి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి.. కాళేశ్వరంలో జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలని.. లేదంటే కేసీఆర్ ఇచ్చిన కమీషన్ ల వల్లే బీజేపీ జాతీయ సమావేశాలు జరిగాయని నమ్ముతామన్నారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!