Revanth Reddy: మోడీ మోసానికి.. కేసీఆర్ దోఖాకు సమాధానం ఇస్తాం
Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికలతో తాము మోడీ చేస్తున్న మోసానికి, కేసీఆర్ దోఖాకు గట్టి సమాధానం ఇవ్వబోతున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మహిళ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ను వంద మీటర్ల గోతిలో పాతిపెట్టే అవకాశం వచ్చిందని, ప్రజల్ని మోసం చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలు తీసుకునే నిర్ణయమే.. రాష్ట్ర భవిష్యత్ను మారుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు మునుగోడులో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ను చంపాలని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడని మండిపడ్డారు.
మహిళా గర్జన సభకు తరలివచ్చిన ఆడబిడ్డలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి.. ఆడబిడ్డలంతా తరలివచ్చి, తమ ఆత్మ గౌరవాన్ని చాటారన్నారు. ఆడబిడ్డలకు పదవులిచ్చి గౌరవించింది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. డబుల్ బెడ్రూం, రైతు రుణమాఫీ, దళితులకు భూమి ఇవ్వని కేసీఆర్.. ఓటు ఎలా అడుగుతున్నాడని ప్రశ్నించారు. ధరలు పెంచి, సామాన్యుడి నడ్డి విరిచి.. ఇప్పుడు అభివృద్ధి పేరుతో బీజేపీ నేతలు ప్రజల ముందుకు వస్తున్నారని ఆగ్రహించారు. మీ ఆడబిడ్డను మీ చేతుల్లో పెడుతున్నామని.. పాల్వాయి స్రవంతిని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. పాల్వాయి స్రవంతిని గెలిపిస్తే.. మునుగోడులోని ప్రతి సమస్యని పరిష్కరించడంతో పాటు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
అంతకుముందు కూడా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ పాలన ఫాంహౌస్కే పరిమితమైందని.. బీజేపీ అరాచకాలకు ఆ పార్టీ 8 ఏళ్లు వంతపాడిందని అన్నారు. పథకాల మాటున అడ్డు అదుపు లేని దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రైతు రుణమాఫీ హామీ అమలు కాలేదని, అన్నదాతల ఆత్మహత్యల పరంపర ఆగడం లేదని చెప్పారు. ఉచిత ఎరువుల హామీ కాకి ఎత్తుకెళ్తే.. నిరుద్యోగులకు భృతి ఓ భ్రమగా మిగిలిపోయిందన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉందన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతోందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!