CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- బండి భగీరథ్ అరెస్టుపై సీఎం రేవంత్ క్లారిటీ
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్పై ఘాటు వ్యాఖ్యలు
- ధాన్యం సేకరణ జాప్యానికి కారణాలు వివరించిన సీఎం
- శవరాజకీయాలు చేయొద్దంటూ ప్రతిపక్షాలకు హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్టుపై వస్తున్న ఊహాగానాలను, దొడ్డిదారి లొంగుబాటు ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. “మా పోలీసులు చెప్పిన వాస్తవాలనే మేము చెప్తాం. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే ఇంట్లోనో లేక పోలీస్ స్టేషన్కో వచ్చి అప్పగిస్తారు. అంతేగానీ, పోలీసులు రోడ్డుపై ‘నాకాబందీ’ (చెక్ పోస్ట్) నిర్వహిస్తుండగా దొరికితే.. దాన్ని ముందస్తు లొంగుబాటు అంటారా?” అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష నేతల తీరును తప్పుబడుతూ.. “ఇక్కడ కేటీఆర్ జడ్జి లాగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (IO) లాగా వ్యవహరిస్తున్నట్టు ఉన్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫిర్యాదు రాగానే చట్టప్రకారం కేసు పెట్టాం. పోక్సో లాంటి సెన్సిటివ్ కేసులలో కూడా తాము పద్ధతిగా వ్యవహరిస్తున్నాం. వాళ్లలాగా మేము రోడ్డు మీద పడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడలేం” అని సీఎం ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగా హమాలీల కొరత ఏర్పడిందని, దీనివల్ల రవాణాలో స్వల్ప అంతరాయం కలిగిందే తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం లేదని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వేగంగా ధాన్యాన్ని సేకరిస్తోందని, కొనుగోలు చేసిన కేవలం 72 గంటల్లోపు నేరుగా రైతులకు డబ్బులు చెల్లిస్తోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
ప్రతిపక్ష నేతలు రాజకీయ లబ్ధి కోసం రైతుల మరణాలను వాడుకుంటూ ‘శవరాజకీయాలు’ చేస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలలో అప్పటి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నప్పుడు మౌనంగా ఉన్న నాయకులు, ఇప్పుడు తమ ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాము సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడానికి మంత్రులను, కలెక్టర్లను స్వయంగా పంపి పర్యవేక్షిస్తున్నామని, ప్రజల కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!