Revanth Reddy: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై టీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే.. అవసరమైన వాళ్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో నిందితులు, బాధితురాలు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా ముఖ్యమైన ఆధారాలని ఆయన అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే, యజమానులకు సమాచారం అందించాలని..ఎంపీ యాక్ట్ ప్రకారం యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలవాలని.. లేదంటే వాళ్లపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వాహనాల యజమానులపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇన్నోవా వాహనం ఎవరిదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఎంఐఎం నేతల పిల్లలు ఈ కేసులో ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు భాగస్వామ్యంలో ఉన్నాయని.. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాయని.. రేపులు, మర్డర్లలో కూడా ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన ప్రభుత్వ వాహనాన్ని అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం జరిగిన వాహనాలు ఎవరివి..వారిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. కేసును బలహీన పరిచి నిందితులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ సీవీ ఆనంద్ తప్పించుకునేలా సమాధానాలు చెప్పారని ఆయన అన్నారు.
Also Read
హైదరాబాద్లో జరగుతున్న సంఘటనలు బ్రాండ్ ఇమేజీని తగ్గిస్తున్నాయని..వారం పదిరోజుల్లో ఎన్నో గ్యాంగ్ రేపులు జరిగాయని ఆయన ఆరోపించారు. వీటన్నింటికి పబ్ లు, గంజాయినే కారణం అని ఆరోపించారు. పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తడి తీసుకువస్తుందని ఆరోపించారు. మైనర్లను అనుమతి ఇస్తున్న పబ్ లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్ పై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని..మైనర్ బాలికలపై రేపులు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు సమీక్ష చెయ్యలేదని ప్రశ్నించారు. జాతీయ అంతర్జాతీయ అంశాలపై స్పందించే ఒవైసీ, మైనర్ బాలిక రేప్ విషయంలో ఎందుకు స్పందించరని అడిగారు.
హైదరాబాద్ ను రక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని.. పబ్ లపై దాడి చేయ్యాలని ఎన్ఎస్యూఐకి పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఏయిర్ పోర్ట్ వద్ద నిర్వహిస్తున్న పబ్ లు బ్రోతల్ హౌజ్ లను మించిపోతున్నాయని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు హైదరాబాద్ అడ్డాగా నిలుస్తుందని విమర్శించారు.
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!