CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- కోయిల్ సాగర్, జూరాల డ్యామ్, కొత్త బ్యారేజీ ప్రాంతాల పరిశీలన
- కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి
- ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని అధికారులకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : పాలమూరు (మహబూబ్నగర్) జిల్లా పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విస్తృతంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఈ సర్వేలో పాల్గొన్నారు.
కీలక ప్రాజెక్టుల పరిశీలన
ముఖ్యమంత్రి , మంత్రుల బృందం పాలమూరు జిల్లాలోని పలు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ఆకాశ మార్గం ద్వారా క్షుణ్ణంగా పరిశీలించింది. ముఖ్యంగా కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదించిన నూతన బ్యారేజీల స్థలాలు, , జూరాల ప్రాజెక్టు డ్యామ్ను సీఎం రేవంత్ రెడ్డి వీక్షించారు. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Also Read
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
- Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
కొడంగల్ ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక ఫోకస్
ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గ పరిధిలోని కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ పథకంలో అత్యంత కీలకమైన కాట్రేవుపల్లి పంప్ హౌస్ వద్ద జరుగుతున్న పనుల నిర్మాణ శైలిని, పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీక్షించారు. ఈ ప్రాంతానికి సాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుండటంతో దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.
అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులన్నింటినీ యుద్ధప్రతిపాదికన వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మంత్రుల బృందం కూడా ప్రాజెక్టుల వారీగా ఉన్న అడ్డంకులను తొలగించి, పనులను త్వరగా ముగించాలని అధికారులకు సూచించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!