Election ink: ఎన్నికల సిరాను ఎక్కడ తయారు చేస్తారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election ink: ఎన్నికల్లో ఓటు మాత్రమే కాదు.. సిరా చుక్క కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎన్నికల రోజున సిరా చుక్కతో వేలి చూపి ఓటేసినట్లు చూపిస్తుంటారు. ఓటు వేశామని చెప్పుకోవడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను అరికట్టేందుకు సిరా చుక్క ఆయుధం. భారత్తోపాటు ఇతర దేశాల్లో ఎన్నికల సమయంలో ఓటు వేసిన అభ్యర్థికి వేలి సిరా చుక్క వేయడం ఆనవాయితీ. దేశ గమనాన్ని మార్చే ఓటు.. ఆ ఓటును ఖరారు చేసే సిరా చుక్క మన హైదరాబాద్లోనే తయారవుతోంది. భారత ఎన్నికల సంఘం రూల్ 37 ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా గుర్తు ఉంటుంది. ఈ ఇంక్ డాట్ పద్ధతిని ఎన్నికల సంఘం 1962లో ప్రవేశపెట్టింది. సిరా చుక్క బాటిల్ ను భారత ఎన్నికల సంఘం పోలింగ్ స్టేషన్లకు సరఫరా చేస్తుంది. ఎన్నికల సమయంలో ఉపయోగించే ఇంక్ డ్రాప్ను వాస్తవానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారు చేసి సరఫరా చేసింది. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే సరఫరా జరిగేది.
Read also: Astrology: మే 12, ఆదివారం దినఫలాలు
Also Read
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ఆ తర్వాత 1990 నుంచి హైదరాబాద్లో ఇంక్ డ్రాప్ తయారీ ప్రారంభమైంది. ఉప్పల్లోని రాయుడు లేబొరేటరీస్ అనే సంస్థ ఎన్నికల కమిషన్కు ఇంక్ డ్రాప్ ను సరఫరా చేస్తుంది. మైసూర్ కంపెనీతో పోలిస్తే చిన్న కంపెనీ అయినప్పటికీ.. దేశాల్లో జరిగే ఎన్నికల కోసం దాదాపు వంద దేశాలకు ఇండెలబుల్ సిరా సరఫరా చేస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భారత్ తో పాటు శ్రీలంక, నైజీరియా, మాల్దీవులు, ఇథియోపియా, జాంబియా, దక్షిణాఫ్రికా, తూర్పు తైమూర్ తదితర దేశాలకు పంపిణీ చేస్తున్నట్లు కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సిరాలో వాడే సిల్వర్ నైట్రేట్ శాతాన్ని బట్టి అది చెరిగిపోయే సమయం ఉంటుంది. ఈ సిరా 5 ml, 10 ml, 25 ml, 50 ml, 60 ml మరియు 100 ml బాటిళ్లలో తయారు చేసి, సిద్ధం చేస్తా అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్కు 5 ఎంఎల్ బాటిళ్లను సరఫరా చేస్తున్నారు. దాదాపు 300 మందికి ఒక్క సీసా సరిపోతుందని తెలిపారు. ఇటీవల జరిగిన బీహార్ పంచాయతీ ఎన్నికల్లో సిరాకు బదులు మార్కర్ల ఆర్డర్లు వచ్చాయని రాయుడు లేబొరేటరీస్ తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, కంపెనీ టర్నోవర్ ఏడాదికి 50 నుంచి 60 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
Maharashtra: ఘోర ప్రమాదం.. టైర్ పేలి ముగ్గురు మహిళలు మృతి
తాజావార్తలు
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!