Election ink: ఎన్నికల సిరాను ఎక్కడ తయారు చేస్తారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election ink: ఎన్నికల్లో ఓటు మాత్రమే కాదు.. సిరా చుక్క కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎన్నికల రోజున సిరా చుక్కతో వేలి చూపి ఓటేసినట్లు చూపిస్తుంటారు. ఓటు వేశామని చెప్పుకోవడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను అరికట్టేందుకు సిరా చుక్క ఆయుధం. భారత్తోపాటు ఇతర దేశాల్లో ఎన్నికల సమయంలో ఓటు వేసిన అభ్యర్థికి వేలి సిరా చుక్క వేయడం ఆనవాయితీ. దేశ గమనాన్ని మార్చే ఓటు.. ఆ ఓటును ఖరారు చేసే సిరా చుక్క మన హైదరాబాద్లోనే తయారవుతోంది. భారత ఎన్నికల సంఘం రూల్ 37 ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా గుర్తు ఉంటుంది. ఈ ఇంక్ డాట్ పద్ధతిని ఎన్నికల సంఘం 1962లో ప్రవేశపెట్టింది. సిరా చుక్క బాటిల్ ను భారత ఎన్నికల సంఘం పోలింగ్ స్టేషన్లకు సరఫరా చేస్తుంది. ఎన్నికల సమయంలో ఉపయోగించే ఇంక్ డ్రాప్ను వాస్తవానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారు చేసి సరఫరా చేసింది. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే సరఫరా జరిగేది.
Read also: Astrology: మే 12, ఆదివారం దినఫలాలు
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ఆ తర్వాత 1990 నుంచి హైదరాబాద్లో ఇంక్ డ్రాప్ తయారీ ప్రారంభమైంది. ఉప్పల్లోని రాయుడు లేబొరేటరీస్ అనే సంస్థ ఎన్నికల కమిషన్కు ఇంక్ డ్రాప్ ను సరఫరా చేస్తుంది. మైసూర్ కంపెనీతో పోలిస్తే చిన్న కంపెనీ అయినప్పటికీ.. దేశాల్లో జరిగే ఎన్నికల కోసం దాదాపు వంద దేశాలకు ఇండెలబుల్ సిరా సరఫరా చేస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భారత్ తో పాటు శ్రీలంక, నైజీరియా, మాల్దీవులు, ఇథియోపియా, జాంబియా, దక్షిణాఫ్రికా, తూర్పు తైమూర్ తదితర దేశాలకు పంపిణీ చేస్తున్నట్లు కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సిరాలో వాడే సిల్వర్ నైట్రేట్ శాతాన్ని బట్టి అది చెరిగిపోయే సమయం ఉంటుంది. ఈ సిరా 5 ml, 10 ml, 25 ml, 50 ml, 60 ml మరియు 100 ml బాటిళ్లలో తయారు చేసి, సిద్ధం చేస్తా అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్కు 5 ఎంఎల్ బాటిళ్లను సరఫరా చేస్తున్నారు. దాదాపు 300 మందికి ఒక్క సీసా సరిపోతుందని తెలిపారు. ఇటీవల జరిగిన బీహార్ పంచాయతీ ఎన్నికల్లో సిరాకు బదులు మార్కర్ల ఆర్డర్లు వచ్చాయని రాయుడు లేబొరేటరీస్ తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, కంపెనీ టర్నోవర్ ఏడాదికి 50 నుంచి 60 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
Maharashtra: ఘోర ప్రమాదం.. టైర్ పేలి ముగ్గురు మహిళలు మృతి
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!