Rangareddy Crime: విచారణ జరిపించండి.. షాద్ నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్..
- షాద్ నగర్ ఘటనపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం..
- బాధితులకు న్యాయం చేస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy Crime: షాద్ నగర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయం వెళ్లడంతో ఆయన వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనతో సంబంధం ఉందని భావించిన వారిని వెంటనే అక్కడి నుంచి తప్పించి పోలీస్ హెడ్క్వార్టర్కు ఎటాచ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఘటనలో బాధితులకు న్యాయం చేయడంతో పాటు వారికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Read also: Andhra Pradesh: మరో శాఖలో అవకతవకలపై ఏపీ సర్కార్ ఫోకస్.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక..
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బంగారం చోరీ కేసులో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించక ముందే మహిళా సునీతపై షాద్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. గత నెల 24వ తేదీన ఆమెపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో 333(3)305 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ఆ తరువాత విచారణ పేరుతో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారనీ, బాధితుల ఆరోగ్య పరిస్థితి బాగాలేక నడవలేని స్థితిలో ఉన్న విషయం వారిని చిత్రహింసలకు గురి చేసిన ఘటన వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ ఘటన విషయమై వార్తలు అటు ప్రతిపక్ష పార్టీలను ప్రజాసంఘాలను ఇటు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై ఇప్పటికే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని పోలీసు ఉన్నత స్థాయి అధికారులు సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. మొత్తం దీంట్లో ఐదుగురు పోలీసు సిబ్బంది టార్చర్ చేసినట్టు చిత్రహింసల గురి చేసినట్టు తెలుస్తుంది. దళిత మహిళపై దాడి చేసి, చిత్రహింసల గురిచేసిన పోలీసు సిబ్బందిలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి తో పాటు క్రైమ్ సిబ్బంది రఫీ ,మోహన్ లాల్ ,కరుణాకర్ , అఖిల, ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. విరిపై కూడా చర్యలు తీసుకోవాలని అటు ప్రతిపక్ష పార్టీలతో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.
Godavari River: గోదావరి దోబూచులాట.. 33.5 అడుగులకు నీటిమట్టం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!