Ramagundam Pollution:కాలుష్య సుడిగుండం.. ప్రజలకు శాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలుష్యం పెరిగి కొద్దీ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కాలుష్య సుడిగుండంలా మారుతోంది. పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాంతానికి శాపంలా మారింది. రామగుండంలో భూగర్భం ఉపరితలం అంతా విషతుల్యంగా తయారైంది. ఏ విష వాయువు ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియక తాగే నీరు కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతూ జనం ఆందోళన చెందుతున్నారు. రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్, జెన్ కో సింగరేణిల కాలుష్యం బూడిద చెరువుల గుట్టలతో నింగి నేల నీరు జనాలను దెబ్బతిస్తున్నాయి.
ఆర్ ఎఫ్ సి ఎల్ నుండి ఆమోనియా వ్యర్ధాలు ఎలాంటి ట్రీట్ మెంట్ లేకుండా గోదావరిని కాలుష్య గరళంగా మారుస్తున్నాయి. మరోవైవు ఫ్యాక్టరీ నుండి వెలువడే ఆమోనియా విష వాయువు రామగుండం వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు ఎన్టీపీసీ లో బొగ్గు కాల్చగా వెలువడే యాష్ కందనపల్లి గ్రామంలోని యాష్ చెరువుకు తరలిస్తారు అక్కడ నుండి వందల లారీల్లో రవాణా నేపథ్యంలో అనేక గ్రామాలు బూడిద మయంగా మారుతున్నాయి. ఇటు సింగరేణి కాలనీల నుండి వెలువడే వ్యర్థ జలాలు జనగామ చెరువు వద్ద గోదావరిలో కలుస్తాయి. అదే గోదావరి నుండి సింగరేణి కాలనీ లకు,పట్టణానికి త్రాగు నీరుగా అందిస్తున్నారు. కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఓపెన్ కాస్టుల్లో బాంబుల మోత దుమ్ము ధూళి అంతా కలిసి రామగుండం ఏరియా కాలుష్య కోరల్లో చిక్కుకుంది.
Also Read
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఇంకోవైపు ఈ ప్రాంతాలలో నివసించే మనుషులు జీవిత కాలం కనీసం పదేళ్లు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మ ఎముకల జబ్బులు, గుండె సంబంధిత రోగాలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోకుండా ఉండటం వల్లనే జల వాయు శబ్ద కాలుష్య నియంత్రణ చేయలేని స్థితికి రామగుండం చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. రామగుండం ప్రాంతంలో మానవ మునుగడప్రశ్నర్థకంగా మారిందని అంటున్నారు. రామగుండంలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాజావార్తలు
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!