Bribe : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎమ్మార్వో, ఆర్ఐ
- ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకొని ఎమ్మార్వో కు అప్పగించారు
- అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నావని ఎమ్మార్వో ట్రాక్టర్ ను సీజ్ చేశారు
- ఆ ట్రాక్టర్ ను రిలీజ్ చేయాలంటే 25 వేల డీడి తో పాటు అదనంగా డబ్బులు ఇవ్వాలని ఎమ్మార్వో, ఆర్ఐ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bribe : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం ఎమ్మార్వో ఉయ్యాల రమేష్, ఆర్ ఐ శ్రీధర్ లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల రామగుండం కు చెందిన ఆలకుంట మహేష్ తన ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకొని ఎమ్మార్వో కు అప్పగించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నావని ఎమ్మార్వో ట్రాక్టర్ ను సీజ్ చేశారు. ఆ ట్రాక్టర్ ను రిలీజ్ చేయాలంటే 25 వేల డీడి తో పాటు అదనంగా డబ్బులు ఇవ్వాలని ఎమ్మార్వో, ఆర్ఐ డిమాండ్ చేశారు. దీంతో మహేష్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో ఈరోజు 25 వేల డీడి తో పాటు 12,000 లంచం తీసుకుంటుండగా ఆర్ఐ శ్రీధర్ ను పట్టుకున్నారు. వెంటనే డబ్బులు పడవేసి శ్రీధర్ పరారైనట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిలో బాధ్యుడైన ఎమ్మార్వో ను విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి స్పష్టం చేశారు.
Brazil: బ్రెజిల్కి గెస్ట్గా వెళ్తే గోల్డ్ చైన్ చోరీ.. భోరున విలపించిన లిసిప్రియా
Also Read
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
కాగా ఇదే ఎమ్మార్వో గతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. అలాగే అంతర్గాం లో మూడేళ్ల క్రితం భూమి రిజిస్ట్రేషన్ విషయంలో పెద్దంపేట శంకర్ నుంచి అప్పటి ఎమ్మార్వో సంపత్, ఆర్ఐ హాజీమ్ లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే తనను ఎమ్మార్వో, ఆర్ఐ మానసిక ఇబ్బందులకు గురి చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఆలకుంట మహేష్ తెలిపారు. ఈ క్రమంలోనే 25వేల డీడీ అదనంగా 12,000 ఎమ్మార్వో కు ఇచ్చేందుకు వెళ్లగా ఆర్ఐకి శ్రీధర్ ను కలిసి ఇవ్వమన్నాడని బాధితుడు పేర్కొన్నారు.
Brazil: బ్రెజిల్కి గెస్ట్గా వెళ్తే గోల్డ్ చైన్ చోరీ.. భోరున విలపించిన లిసిప్రియా
తాజావార్తలు
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!