Rajanna Sircilla: బాత్రూంలో ఉండగా వీడియో తీసిన పీఈటీ.. రోడెక్కిన విద్యార్థినిలు
- తంగళ్ళపల్లి మండలం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణం..
- పీఈటిని సస్పెండ్ చేయాలని ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు..
- స్నానం చేస్తున్న సమయంలో డోర్ పగలగొట్టి వీడియో రికార్డు చేస్తున్న పీఈటీ టీచర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sirisilla: న్యాయం చేయాలంటూ 500 మంది విద్యార్థినులు రోడ్డెక్కిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణం వెలుగులోకి వచ్చింది. పీఈటిని సస్పెండ్ చేయాలని ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు డిమాండ్ చేశారు. 500 పైగా విద్యార్థినులకు రెండు బాత్రూంలు మాత్రమే ఉన్నాయని వాపోయారు. విద్యార్థినులకు నెలవారి పీరియడ్ ఉన్న సమయంలో బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో పీఈటి టీచర్ లేట్ ఎందుకు అవుతుందని డోర్ పగలగొట్టి.. లోనికి వచ్చి తన ఫోన్ తో వీడియో రికార్డు చేస్తూ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఈటి జ్యోత్స్న విద్యార్థినులను పెట్టె ఇబ్బందులు భరించలేక పోతున్నామని వాపోయారు.
Read also: Dhanush: ధనుష్ పై నిషేధం ఎత్తివేత..
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
పీఈటి సైకో అంటూ .. బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారి పై ధర్నాకు దిగామని కన్నీరుమున్నీరుగా విలపించామన్నారు. మేము బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో లోనికి వచ్చి బట్టలు లేకుండా వీడియోలు తీస్తు బూతులు తిడుతూ కొడుతూ.. తీసుకెళ్తుందని విద్యార్థినులు రోడ్డెక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్న పిఈటీ జోత్స్న పెట్టే ఇబ్బందులు భరించలేక ఇందిరమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినులు ఉదయం 5 గంటలకు సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారి పై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. కొట్టిన దెబ్బలని చూపిస్తూ విద్యార్థినులు రోదిన్నారు. సైకో టీచర్ ని సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్న ఎంఈఓ రఘుపతి, పోలీసులు హుటా హుటిన చేరుకున్నారు. పిఈటీ జ్యోత్స్నను విధుల నుండి తప్పిస్తున్నామని డీఈఓ హామీతో విద్యార్థినిలు ఆందోళన విరమించారు.
MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు..
తాజావార్తలు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!