Rajanna Sircilla: బాత్రూంలో ఉండగా వీడియో తీసిన పీఈటీ.. రోడెక్కిన విద్యార్థినిలు
- తంగళ్ళపల్లి మండలం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణం..
- పీఈటిని సస్పెండ్ చేయాలని ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు..
- స్నానం చేస్తున్న సమయంలో డోర్ పగలగొట్టి వీడియో రికార్డు చేస్తున్న పీఈటీ టీచర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sirisilla: న్యాయం చేయాలంటూ 500 మంది విద్యార్థినులు రోడ్డెక్కిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణం వెలుగులోకి వచ్చింది. పీఈటిని సస్పెండ్ చేయాలని ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు డిమాండ్ చేశారు. 500 పైగా విద్యార్థినులకు రెండు బాత్రూంలు మాత్రమే ఉన్నాయని వాపోయారు. విద్యార్థినులకు నెలవారి పీరియడ్ ఉన్న సమయంలో బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో పీఈటి టీచర్ లేట్ ఎందుకు అవుతుందని డోర్ పగలగొట్టి.. లోనికి వచ్చి తన ఫోన్ తో వీడియో రికార్డు చేస్తూ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఈటి జ్యోత్స్న విద్యార్థినులను పెట్టె ఇబ్బందులు భరించలేక పోతున్నామని వాపోయారు.
Read also: Dhanush: ధనుష్ పై నిషేధం ఎత్తివేత..
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
పీఈటి సైకో అంటూ .. బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారి పై ధర్నాకు దిగామని కన్నీరుమున్నీరుగా విలపించామన్నారు. మేము బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో లోనికి వచ్చి బట్టలు లేకుండా వీడియోలు తీస్తు బూతులు తిడుతూ కొడుతూ.. తీసుకెళ్తుందని విద్యార్థినులు రోడ్డెక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్న పిఈటీ జోత్స్న పెట్టే ఇబ్బందులు భరించలేక ఇందిరమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినులు ఉదయం 5 గంటలకు సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారి పై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. కొట్టిన దెబ్బలని చూపిస్తూ విద్యార్థినులు రోదిన్నారు. సైకో టీచర్ ని సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్న ఎంఈఓ రఘుపతి, పోలీసులు హుటా హుటిన చేరుకున్నారు. పిఈటీ జ్యోత్స్నను విధుల నుండి తప్పిస్తున్నామని డీఈఓ హామీతో విద్యార్థినిలు ఆందోళన విరమించారు.
MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!