Rajagopal Reddy: అర్థ రూపాయికి అమ్ముడుపోని వారికి 100 కోట్లు పెడతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajagopal Reddy Fires On TRS Over Moinabad Far House Case: మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అది టీఆర్ఎస్ ఆడిన డ్రామా అని విమర్శించారు. అర్థ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లు పెడతారా? అని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేలను తాము కాదు కదా.. ఏ పార్టీలోనూ రానివ్వరని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు మతి భ్రమించి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని, ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ‘డబ్బు రాజకీయాలు’ చేస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణలో బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడలేదని.. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతు లేకుండా.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనునగోలు చేసి, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సీఎంకి సరైన జవాబు చెప్పాలని అన్నారు.
టీఆర్ఎస్లో రాజకీయాలు చేసే వారివి బానిస బతుకులని.. అవమానాలు భరించలేక బూర నర్సయ్య గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు ఎంతోమంది ఉద్యమకారులు పార్టీలో ఉండేవారని, ఇప్పుడు ఒక్కరు కూడా లేరని చెప్పారు. కేవలం ఒక ఎమ్మెల్యేను ఓడించేందుకు.. ఆలీబాబా 40 దొంగల ముఠా దిగిందని సెటైర్ వేశారు. నీ డబ్బు, నీ అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారని నిప్పులు చెరిగారు. దురహంకార పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల కోసమే తెలంగాణ వచ్చిందని.. ప్రస్తుతం పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకునే పరిస్థితి లేదని వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో.. గురువారం నిర్వహించిన గౌడ ఆత్మీయ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా స్పందించారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!