Raja Singh: బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. రాజాసింగ్ అసహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh Shows Anger On State Intelligent Over Bulletproof Vehicle: ఇంటెలిజెన్స్ అధికారులు తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మీద ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా.. తరచూ మరమ్మత్తులకు గురయ్యే వాహనాన్ని ఇచ్చారంటూ ఆయన మండిపడ్డారు. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు తనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని, అది 4 నెలల క్రితం రోడ్డు మధ్యలోనే ఆగిపోయిందని వాపోయారు. అప్పుడు తాను ఆ వాహనాన్ని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తిరిగి పంపించానన్నారు. మరమ్మత్తులు చేసి మళ్లీ అదే వాహనాన్ని ఇచ్చారని, 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కూడా అది ఆగిపోయిందని పేర్కొన్నారు. ఆ టైంలో గన్మెన్ల సాయంతో తనని ఆటోలో కోర్టుకు తీసుకెళ్లారన్నారు.
అంతేకాదు.. అఫ్జల్గంజ్ వద్ద కూడా ఆ వాహనం మరోసారి ఆగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మరోదారి లేక, తన సొంత వాహనాన్నే రప్పించుకొని వెళ్లానన్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న తనకు.. ఇంటెలిజెన్స్ అధికారులు ఇలాంటి వాహనం ఇస్తారా? అని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. కండీషన్లో లేని వాహనంలో తనకు ఏమాత్రం భద్రత ఉంటుందనే విషయాన్ని తాను పోలీసు అధికారులు దృష్టికి గతంలో చాలాసార్లు తీసుకెళ్లినా.. అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన చెందారు. కాగా.. పీడీ యాక్ట్ కేసులో ఇటీవల బైలుపై రాజాసింగ్ జైలు నుంచి రిలీజైన సంగతి తెలిసిందే! ఎలాంటి ప్రెస్మీట్లు ఇవ్వకూడదని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని, ర్యాలీలు కూడా నిర్వహించకూడదన్న షరతులతో ఆ బైలుని మంజూరు చేసింది.
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షోను హైదరాబాద్లో నిర్వహించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. రాజాసింగ్ ఒక వీడియోని విడుదల చేశారు. అది ఓ వర్గానికి చెందిన వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో, దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అప్పుడు విద్వేష వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. దీనికి సవాల్ చేస్తూ రాజాసింగ్ సతీమణి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని విచారించిన కోర్టు.. వాదోపవాదనలు విన్నాక షరతులతో కూడిన బెయిల్ని రాజాసింగ్కి మంజూరు చేసింది.
తాజావార్తలు
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
-
Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
-
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!