Raja Singh : గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన.. హిందుత్వ కోసం పోరాటం కొనసాగుతుంది
- ఢిల్లీ నేతల నిర్లక్ష్యంపై రాజాసింగ్ ఆవేదన
- హిందుత్వ, గోరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం
- పదవులు లేకపోయినా దేశద్రోహులపై పోరాటం ఆగదు : రాజాసింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh : గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను ఆవేదనతో వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజీనామా వెనుక ఉన్న భావోద్వేగాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.
“నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీకి కృతజ్ఞతలు. కార్యకర్తగా 11 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరాను. గోషామహాల్ నుంచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి గోషామహాల్ ప్రజల సంక్షేమం కోసం, హిందుత్వ బలోపేతం కోసం, గోరక్షణ కోసం కృషి చేశాను,” అంటూ తన విధేయతను గుర్తు చేశారు.
Also Read
- Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
Visakhapatnam: రైలును తలపించే క్యాప్సుల్ హోటల్.. ఎక్కడో కాదు మన విశాఖ రైల్వే స్టేషన్లోనే…
అయితే, పార్టీ కార్యకర్తల మనోవేదనను ఢిల్లీ నాయకులకు వివరించలేకపోయానన్న ఆవేదన వ్యక్తం చేశారు. “లక్షలాది కార్యకర్తల గొంతును బీజేపీ కేంద్ర నేతల దృష్టికి తీసుకెళ్లలేకపోయాను. ఇది నాకు బాధగా మిగిలింది,” అని వ్యాఖ్యానించారు.
రాజీనామా అనంతరం కూడా తన పోరాటం కొనసాగుతుందన్న రాజాసింగ్, “లవ్ జిహాద్ వ్యతిరేకంగా, గోరక్షణ కోసం, హిందుత్వాన్ని బలోపేతం చేయడానికి ఇకపై మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాను. పదవులు లేకపోయినప్పటికీ దేశద్రోహులపై పోరాడాను. ఇప్పుడు ఉన్నా, ఎప్పుడూ ఈ పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
బీజేపీలో ఉన్న హిందుత్వవాదులు, ధర్మకర్తలు భయపడవద్దని, నిరాశ చెందవద్దని సూచిస్తూ, తనపై ఇప్పటివరకు చూపిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై కూడా తాను అదే ధర్మ మార్గంలో కొనసాగుతానని రాజాసింగ్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
-
Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
-
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!