Pudding and Mink Pub: డ్రగ్స్ తీసుకున్నవారికి షాక్.. త్వరలో నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోందా? డ్రగ్స్ తీసుకున్నవారికి నోటీసులు జారీ కానున్నాయా? అంటే అవునంటున్నారు పోలీసులు. పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. బంజారా హిల్స్ లోని పబ్ లో పట్టుబడిన వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు లభించాయి.
20 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా లభ్యమైన ఆధారాలతో దర్యాప్తులో ముందడుగు పడిందంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న వీఐపీలకు కూడా నోటీసులు జారీచేసే అవకాశం వుందంటున్నారు. మేనేజర్ అనిల్ తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా జరిగిందంటున్నారు. అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్ పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలింది. అతని ఫోన్లో గోవా ముంబై కి చెందిన కొంతమంది వ్యక్తుల సమాచారం వుందని తెలుస్తోంది.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
https://ntvtelugu.com/young-girl-commited-suicide-because-of-whatsapp-status/
మేనేజర్ అనిల్ కాంటాక్ట్ లో గతంలో డ్రగ్స్ తో పట్టుబడిన పెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. గోవా, ముంబై నుంచి అనిల్.. డ్రగ్స్ తెప్పించాడని పోలీసులకు ఆధారాలు లభించాయి. మరోవైపు డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఉద్యోగాలు పోతామని ఐటీ కంపెనీలు వార్నింగ్ లు ఇస్తూనే వున్నాయి. కేసుకు సంబంధించి పట్టుబడిన వారిలో డ్రగ్స్ తీసుకున్న ఐటీ ఉద్యోగులపై ఆయా కంపెనీలు వేటు వేశాయి. పోలీసులు నోటీసులు ఇవ్వకముందే 13 మందిని సదరు ఐటీ కంపెనీలు తొలగించడం విశేషం. మరికొంతమంది ఈ జాబితాలో వున్నారని తెలుస్తోంది.
మరో 50 మంది ఐటీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసే ఉద్దేశంలో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు ఉన్నారు. ఇప్పటికే పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ పెడ్లర్ల దగ్గర లభించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల చిట్టా ప్రకారం పోలీసులు ముందడుగు వేయనున్నారు. అందులో 50 మందికి ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పెడ్లర్లు డ్రగ్స్, గంజాయి అమ్మినట్లు పోలీసులు తేల్చారు. ప్రముఖ కంపెనీలకు చెందిన పలువులు ఉద్యోగులు ఇప్పుడు షాక్ అవుతున్నారు. తమ భవిష్యత్ పై వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబపరువు, కెరీర్ దెబ్బతింటాయని వేదన పడుతున్నారు.
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!