Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Proposals To Increase Electricity Charges In Telangana

విద్యుత్ ఛార్జీల పెంపుపై తర్జనభర్జన…

Published Date :December 24, 2021 , 11:36 am
By Manohar
విద్యుత్ ఛార్జీల పెంపుపై తర్జనభర్జన…
  • Follow Us :
  • google news
  • dailyhunt

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై డిస్కమ్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాయా? ఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది?గడువులోగా టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకుంటే ఈఆర్సీ ఏం చేస్తుంది?

వార్షిక విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించే విషయంలో విద్యుత్ పంపిణీ సంస్థలు కాలయాపన చేస్తున్నాయి. వాస్తవానికి నవంబర్ 31లోపు ఈఆర్సీకి డిస్కమ్స్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే గడిచిన మూడేళ్ళ టారిఫ్ ప్రతిపాదనలు సైతం సమర్పించకుండా కారణాలు చెబుతూవచ్చాయి. విద్యుత్ నియంత్రణ మండలి కూడా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో డిస్కమ్స్‌కు అవకాశం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు సమయం ఇవ్వకూడదని ఈఆర్సీ నిర్ణయించింది. దీనికి తోడు టారిఫ్ ప్రతిపాదనలు ఎంత ఆలస్యమైతే అంత అపరాధ రుసుం వసూలు చేయాలని…అందుకు తగిన సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది.

Also Read

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?
  • Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
  • PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ.!

విద్యుత్ సంస్కరణల్లో ఉత్తరప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలను తెలంగాణ ఈఆర్సీ కూడా అనువర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ చట్టం, ఎలక్ట్రిసిటీ టారిఫ్ నిబంధనల ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్ 31లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీలకు సమర్పించాలి.

ఐతే…చాలా రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలు కావడం లేదు. విద్యుత్ చార్జీలు పెంచితే వచ్చే ప్రజా వ్యతిరేకత, విపక్షాల విమర్శలు వంటి కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలకు అనుమతి ఇవ్వడం లేదు. తెలంగాణలో సైతం గడిచిన ఐదేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచలేదు. డిస్కంలు ఏటా ప్రతిపాదనలను సిద్ధం చేసుకున్నా..ప్రభుత్వం నుంచి అనుమతి రాక ఈఆర్సీకి సమర్పించలేదు. చార్జీలు పెంచకపోవడంతో డిస్కంలపై భారం పెరిగి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది.

ఇక…దీనిపై…ఇటీవల జరిగిన ఓ సదస్సులో ఈఆర్సీల చైర్మన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నివారించడం కోసం భారీగా జరిమానాలు విధించేలా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ఈఆర్సీ కొత్త నిబంధనలను ప్రకటించింది. డిస్కంలు వార్షిక టారిఫ్ పెంపు ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, మల్టీ ఇయర్ టారిఫ్ ప్రతిపాదనలు, ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలను నిర్దేశిత గడువులోగా సమర్పించకుంటే..రోజుకు 5000 చొప్పున తొలి 30 రోజులు జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. 30 రోజుల తర్వాత రోజుకు 10 వేలతో పాటు అదనంగా లక్ష రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. డిస్కంలు ఇలా చెల్లించే జరిమానాలను వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది.

తెలంగాణలోనూ ఇలాంటి నిబంధనలను అమల్లోకి తెచ్చే దిశగా ఈఆర్సీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే కొత్త నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Electricity
  • electricity charges
  • Increase Electricity Charges
  • telangana

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions