విద్యుత్ ఛార్జీల పెంపుపై తర్జనభర్జన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై డిస్కమ్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాయా? ఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది?గడువులోగా టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకుంటే ఈఆర్సీ ఏం చేస్తుంది?
వార్షిక విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించే విషయంలో విద్యుత్ పంపిణీ సంస్థలు కాలయాపన చేస్తున్నాయి. వాస్తవానికి నవంబర్ 31లోపు ఈఆర్సీకి డిస్కమ్స్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే గడిచిన మూడేళ్ళ టారిఫ్ ప్రతిపాదనలు సైతం సమర్పించకుండా కారణాలు చెబుతూవచ్చాయి. విద్యుత్ నియంత్రణ మండలి కూడా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో డిస్కమ్స్కు అవకాశం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు సమయం ఇవ్వకూడదని ఈఆర్సీ నిర్ణయించింది. దీనికి తోడు టారిఫ్ ప్రతిపాదనలు ఎంత ఆలస్యమైతే అంత అపరాధ రుసుం వసూలు చేయాలని…అందుకు తగిన సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
విద్యుత్ సంస్కరణల్లో ఉత్తరప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలను తెలంగాణ ఈఆర్సీ కూడా అనువర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ చట్టం, ఎలక్ట్రిసిటీ టారిఫ్ నిబంధనల ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్ 31లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీలకు సమర్పించాలి.
ఐతే…చాలా రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలు కావడం లేదు. విద్యుత్ చార్జీలు పెంచితే వచ్చే ప్రజా వ్యతిరేకత, విపక్షాల విమర్శలు వంటి కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలకు అనుమతి ఇవ్వడం లేదు. తెలంగాణలో సైతం గడిచిన ఐదేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచలేదు. డిస్కంలు ఏటా ప్రతిపాదనలను సిద్ధం చేసుకున్నా..ప్రభుత్వం నుంచి అనుమతి రాక ఈఆర్సీకి సమర్పించలేదు. చార్జీలు పెంచకపోవడంతో డిస్కంలపై భారం పెరిగి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఇక…దీనిపై…ఇటీవల జరిగిన ఓ సదస్సులో ఈఆర్సీల చైర్మన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నివారించడం కోసం భారీగా జరిమానాలు విధించేలా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ఈఆర్సీ కొత్త నిబంధనలను ప్రకటించింది. డిస్కంలు వార్షిక టారిఫ్ పెంపు ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, మల్టీ ఇయర్ టారిఫ్ ప్రతిపాదనలు, ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలను నిర్దేశిత గడువులోగా సమర్పించకుంటే..రోజుకు 5000 చొప్పున తొలి 30 రోజులు జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. 30 రోజుల తర్వాత రోజుకు 10 వేలతో పాటు అదనంగా లక్ష రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. డిస్కంలు ఇలా చెల్లించే జరిమానాలను వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది.
తెలంగాణలోనూ ఇలాంటి నిబంధనలను అమల్లోకి తెచ్చే దిశగా ఈఆర్సీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే కొత్త నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?