Asaduddin Owaisi: రాజాసింగ్ అరెస్ట్ అయ్యాడు.. నిరసనలు వద్దంటూ ఓవైసీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేత రాజా సింగ్ను రెండోసారి అరెస్టు చేసారని, శుక్రవారం ప్రార్థనలు శాంతియుతంగా జరిగేలా చూడాలని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారి డిమాండ్ ప్రకారమే రాజాసింగ్ అరెస్ట్ చేశారని ఒవైసీ పేర్కొన్నారు కావున ముస్లీం ప్రజలు ప్రశాంతంగా మసీదుల్లో ప్రార్థనలు జరుపుకోవాలని కోరారు.
#Hyderabad की आवाम को @aimim_national प्रमुख @asadowaisi
का पैगाम
हमारी सबसे बड़ी डिमांड यही थी कि जिस शख्स ने ऐसी बकवास की है उसे जेल भेजा जाए, अब ये हमारी जिम्मेदारी है कि कल के नमाज़ ए जुमा के बाद हम कोई नारा न लगाएं, ऐसा कोई वाकया न पेश आए जिससे दूसरों को तकलीफ हो।#RajaSingh pic.twitter.com/cD9wlnpJzNAlso Read
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
— T Raghavan (@NewsRaghav) August 25, 2022
రాజాసింగ్ పై కేసు నమోదు చేసి, జైలుకు పంపాల్సిందే అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే రాజా సింగ్ విడుదల చేసిన విడియో రిలీజ్ చేయడం వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా సింగ్ మహుమద్ ప్రవక్తపై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. దానీ ప్రభావంవల్లే ఇప్పుడు పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తాయని మండిపడ్డారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉండేదని, ఇప్పుడు బీజేపీ వల్ల ప్రశాంతంగా ఉన్న నగరం అశాంతి నెలకొందని ఆరోపించారు. రాజా సింగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. రాజా సింగ్ భవిషత్ లో ఇలాంటి వాక్యలు చేయకుండా ఉండాలంటే అతని పై కేసు లు నమోదు చేసి జైల్ పంపాలని డిమాండ్ చేశారు. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి రాజా సిగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి వాఖ్యలు చేయకుండా ఉండాలంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ స్పందించి రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
నేడు శుక్రవారం దృష్ట్యా.. ఎటువంటి అల్లర్లకు తావులేకుండా.. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న నమోదైన కేసుల్లో భాగంగా.. గురువారం ఉదయం షాహినాయత్, మంగళ్హట్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో మంగళ్హట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాజా సింగ్ అరెస్ట్ తరుణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజా సింగ్కు మద్దతుగా ఆయన అనుచరులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తరచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుండటం వల్లే.. రాజాసింగ్పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఒక ఎమ్మెల్యేపై తెలంగాణ చరిత్రలో పీడీ యాక్ట్ నమోదు కావడం.. ఇదే మొదటిసారి.
Irfan Pathan: విస్తారా ఎయిర్లైన్స్పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే..?
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!