National Drinking Water Survey : 485 నగరాల్లో 46 నగరాల ప్రజలు మాత్రమే స్వచ్ఛమైన నీరు తాగుతున్నారట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Drinking Water Survey : దేశంలోని 485 నగరాల్లో 46 నగరాల ప్రజలు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారు. కేంద్ర పట్టణ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి గురువారం (ఫిబ్రవరి 29) 25,000 నమూనాలను తనిఖీ చేసిన తర్వాత, నగర నమూనాలలో 10 శాతం మాత్రమే 100 శాతంతో ఉత్తీర్ణత సాధించినట్లు తేలింది. శాంపిల్స్ ఆధారంగా 5.2 లక్షల మందితో మాట్లాడి నివేదిక తయారు చేశారు. వచ్చే వారం నగరాల ర్యాంకింగ్ను ప్రకటిస్తామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి గురువారం (ఫిబ్రవరి 29) తెలిపారు. మార్చి 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేజల్ సర్వేక్షణ్ అవార్డును అందజేస్తారని తెలిపారు.
Read Also:Radisson Drugs Case: డ్రగ్ కేసులో కొనసాగుతున్న సస్పెన్స్.. పెరుగుతున్న నిందితుల సంఖ్య
Also Read
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) 2.0 కింద సెప్టెంబర్ 2022లో ఈ సర్వే ప్రారంభించినట్లు మనోజ్ జోషి విలేకరుల సమావేశంలో తెలిపారు. సర్వే ఫలితాలు, మంచి పనితీరు కనబరిచిన నగరాలకు మార్చి 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డ్రింకింగ్ వాటర్ సర్వే అవార్డును అందజేయనున్నారు. సెప్టెంబర్ 2022 – నవంబర్ 2023 మధ్య నిర్వహించిన సర్వే కోసం, లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న 485 నగరాలు, మున్సిపల్ కార్పొరేషన్లను ఎంపిక చేసినట్లు మనోజ్ జోషి చెప్పారు. 95 నుంచి 100 శాతం నగరాల్లో ప్రజలు కుళాయి నీటి సౌకర్యం పొందుతున్నారని వెల్లడించారు. ప్రతి నగరంలో కనీసం ఒక మున్సిపల్ వార్డులో 24 గంటల నీటి సౌకర్యం కల్పించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని, పూరి, నవీ ముంబై, కోయంబత్తూర్, పూణే, నాగ్పూర్, సూరత్ వంటి నగరాల్లోని కొన్ని వార్డులు 24-గంటల పాటు నీరు అందించాలనే లక్ష్యాన్ని సాధించాయని ఆయన చెప్పారు.
Read Also:TDP-Janasena: బీజేపీ పిలుపు కోసం.. టీడీపీ-జనసేన ఎదురుచూపు!
నీటి సరఫరా నాణ్యత, పరిమాణం, కవరేజీలో సేవా స్థాయి విజయాలను అంచనా వేయడానికి మంత్రిత్వ శాఖ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో మురుగునీటి పారుదల, సేప్టేజీ నిర్వహణ, వ్యర్థ జలాల పునర్వినియోగం, నగరంలోని నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!