Prof Kodandaram: పేపర్ లీక్ కేసు సిట్కి ఇవ్వడం వల్ల లాభం లేదు.. సీబీఐకి ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prof Kodandaram Pressmeet On TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ కేసు సిట్కు ఇవ్వడం వల్ల ఎలాంటి లాభం లేదని.. సీబీఐకి ఇవ్వాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది కేవలం ప్రవీణ్, రాజశేఖర్ది కాదని.. పేపర్ సెట్టింగ్కి, ప్రింటింగ్కు ఛైర్మన్ది బాధ్యత అని అన్నారు. తమకు వచ్చిన నోటీసులకు వెనక్కు తీసుకోవాలని కోరారు. సిట్టింగ్ జడ్జ్తో విచారణ జరిపితే.. తమ ఆధారాలు సమర్పిస్తామని చెప్పారు. బలమైన హస్తం లేకుండా పేపర్ లీకేజ్ కాదని.. కేవలం ఇద్దరు కలిసి ఈ పేపర్ని లీక్ చేయలేదని అభిప్రాయపడ్డారు. పేపర్ లీకేజ్ని అరికట్టడం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు.
Revanth Reddy: TSPSC పేపర్ లీక్ కేసుని.. పనోళ్లతో క్లోజ్ చేసే కుట్ర చేస్తున్నారు
Also Read
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
- Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
చాలా సింపుల్గా మెటీరియల్ ఇస్తాం, ఫుడ్ పెడతాం అంటే కుదరదన్న కోదండరాం.. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్ళు, నిధులు, నియామకాలు వల్ల అని.. కానీ అవన్నీ దారితప్పాయని మండిపడ్డారు. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ది అని, మొత్తం అధికారాలు ఆయన దగ్గరే ఉన్నాయని ఆరోపించారు. సొంతంగా అధికారాలు చెలాయించే అధికారం ఏ అధికారికి లేదన్నారు. నాకేం సంబంధం అంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరం కలిసి కొట్టాడాలి, పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో ప్రజలందరిని భాగస్వామ్యం చేయాలన్నారు. మీ పైసలు గెలుస్తాయో.. మా పోరాటాలు గెలుస్తాయో చూద్దామని సవాల్ విసిరారు.
Jammu Kashmir Budget: మూజువాణి ఓటుతో జమ్మూకశ్మీర్ బడ్జెట్కు లోక్సభ ఆమోదం
ఈ టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం వ్యవహారం కేవలం ఇద్దరు వ్యక్తుల సమస్య కాదన్న కోదండరాం.. అందులో పాలకులకు సంబంధం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ కూూడా ఈ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహించాల్సిందేనన్నారు. కేసీఆర్ సర్కార్ 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అరాచకాలపై ఐక్యంగా ఉద్యమం చేసి తీరుతామని ప్రకటించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
-
Oppo K15 5G: 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. ఒప్పో K సిరీస్ 5G ఫోన్ విడుదల
-
Ashes Test in India: భారత్లో యాషెస్ టెస్టు..? సానుకూలంగా స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.!
-
Shreyas Iyer: 7 మ్యాచ్ల నిరీక్షణకు తెర.. రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్కు విముక్తి!
ట్రెండింగ్
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!