Private Colleges : రేపటి నుండి పరీక్షలు బంద్.. ప్రభుత్వం దిగిరావాల్సిందే..!
- రేపటి నుండి ప్రైవేట్ కాలేజీల పరీక్షల బహిష్కరణ
- ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే సమ్మె కొనసాగింపు
- రూ.5 వేల కోట్లు విడుదల చేసే వరకు వెనక్కి తగ్గమంటున్న యాజమాన్యాలు
- రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్, కొందరు మాత్రమే మినహాయింపు
ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (Federation of Private Educational Institutions) ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రేపటి నుండి అన్ని పరీక్షలను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. “రేపటి నుండి పరీక్షలు బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వం దిగివచ్చి మా డిమాండ్ ను పరిష్కరించే వరకు బంద్ కొనసాగుతుంది,” అని రమేష్ బాబు తెలిపారు. ఈ నెల 8న కాలేజీ సిబ్బందితో హైదరాబాద్లో సమావేశం నిర్వహించనున్నట్లు, 11న రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభ నిర్వహించే ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు. “ఏ పరిణామాలు జరిగినా ప్రభుత్వం దే బాధ్యత,” అని ఆయన హెచ్చరించారు.
Rain Forecast in Andhra Pradesh: ఏపీలో మరోసారి భారీ వర్షాలు..!
Also Read
ప్రభుత్వం సమ్మె విరమించేందుకు రూ.300 కోట్లు ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ, యాజమాన్యాలు తిరస్కరించినట్లు తెలిపారు. “9 వందల కోట్లు ఇస్తామన్నా ఒప్పుకోము, బకాయిల్లో 50 శాతం అంటే 5 వేల కోట్లు ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుంది,” అని రమేష్ బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. “కొన్ని కాలేజీలకు మాత్రమే డబ్బులు ఇచ్చారు. అక్కడి నుండి విచారణ ప్రారంభించాలి. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ల వల్లే అక్రమాలు జరిగి ఉండొచ్చు,” అని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేట్ కాలేజీలు బంద్ లో పాల్గొంటున్నట్లు చెప్పారు. అయితే సీబీఐటీ, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, మాతృశ్రీ కాలేజీలు ఇంకా పాల్గొనలేదని, వారితో మాట్లాడుతున్నట్లు సమాఖ్య తెలిపింది.
Air India: శాన్ ప్రాన్సిస్కో-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం మంగోలియాలో ల్యాండింగ్..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!