PM Modi: తెలంగాణకు ప్రధాని మోడీ రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తెలంగాణలో బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేడు, రేపు (శుక్రవారం, శని) సోమవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్షోల్లో మోడీ పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం ప్రధాన హైదరాబాద్ చేరుకుని, రాత్రికి రాజ్ భవన్ లో బస చేస్తారు. శనివారం ఉదయం నాగర్కర్నూల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మళ్లీ 18న జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నేడు, రేపు (శుక్ర, శనివారా)ల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందన్న అంచనాల మధ్య ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే రూ.కోటికి పైగా అభివృద్ధి పనులకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు సాయంత్రం 5.15 గంటలకు మల్కాజిగిరిలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్షోకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న వేళ ప్రధాని రోడ్ షో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనుంది. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నేతలు మల్కాజిగిరిలో రోడ్షో నిర్వహించారు. పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని సన్నాహక సమావేశాలు నిర్వహించి విజయవంతం చేశారు.
Also Read
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
Read also: BSNL Recharge Plans 2024: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శుభవార్త.. రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల గడువు పెంపు!
ప్రధాని షెడ్యూల్ ఇదే…
* శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు ప్రత్యేక విమానంలో కేరళ నుంచి బేగంపేట్ రానున్నారు…
* మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని రోడ్షో ప్రారంభ ప్రదేశానికి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు…
* మల్కాజిగిరిలో సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటల వరకు రోడ్షో నిర్వహించనున్నారు.
* రోడ్డు మార్గంలో 6.40 గంటలకు రాజ్ భవన్ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు.
* శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు నాగర్కర్నూల్ చేరుకుంటారు.
* మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు
* 1 గంటకు నాగర్కర్నూల్ నుంచి హెలికాప్టర్లో కర్ణాటకలోని గుల్బర్గాకు మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరుతారు.
* 18న తిరిగి రాష్ట్రానికి. ఆ రోజు షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేయనున్నారు.
Read also: Health Tips : గుమ్మడి గింజలను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో..
రోడ్ షో ఇలా…
* సాయంత్రం 5.15 గంటలకు మీర్జాలగూడ చౌరస్తా నుంచి ప్రధాని మోడీ రోడ్ షో ప్రారంభమవుతుంది.
* దాదాపు 1.3 కి.మీ. దూరంలోని మల్కాజిగిరి కూడలి వరకు రోడ్ షో జరగనుంది.
* మల్కాజిగిరి చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ మోడీ మాట్లాడే అవకాశం ఉంది.
* దారి పొడవునా దాదాపు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నారు.
* ప్రజలతో పాటు పార్టీ నేతలకు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
* రోడ్షోలో దాదాపు ముప్పై కార్ల కాన్వాయ్ ట్రయల్ రన్ జరిగింది.
నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
నగరంలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. శుక్రవారం సాయంత్రం 4.40 నుండి 7 గంటల మధ్య బేగంపేట్, పిఎన్టి జంక్షన్, రసూల్పురా, సిటిఓ, ప్లాజా, సెయింట్ జాన్స్ రోటరీ, మ్యూజికల్ ఎక్స్ రోడ్, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే హాస్పిటల్, మెట్టుగూడ రోటరీ, మిర్జాలగూడ టి-జంక్షన్, మల్కాజిగిరి తాపి, లాలాపేట్ మోనప్ప జంక్షన్ రాజ్భవన్, ఎంటీఎస్ జంక్షన్, వీవీ విగ్రహం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఆయా మార్గాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా శనివారం ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని వెళతారు. ఆ సమయంలో వివి విగ్రహం, మెట్రో రెసిడెన్సీ లేన్, ఎంటిఎస్ రాజ్ భవన్, పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, హెచ్పిఎస్ అవుట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పిఎన్టి ఫ్లై ఓవర్, ఎయిర్పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి.
Rad also: Droupadi Murmu: నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
మోడీ రాక కట్టుదిట్టమైన భద్రత..
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల (నేడు, రేపు) పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర బలగాలు మోడీ విమానాన్ని బేగంపేట విమానాశ్రయానికి తీసుకెళ్లాయి. విమానాశ్రయం పరిసరాలను అటామైజర్లతో జల్లెడ పట్టారు. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో పోలీసులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈరోజు రోడ్ షో ముగించుకుని మోడీ రాజ్ భవన్ కు తిరిగి రానున్నారు. శనివారం ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన భద్రతా చర్యల్లో భాగంగా, రహదారి ప్రాంతం చుట్టూ నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ బెలూన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్ మరియు పారా గ్లైడింగ్ నిషేధించబడ్డాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రోడ్ షో ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
Read also: SpaceX: ఎలాన్ మస్క్ “మెగా రాకెట్” ప్రయోగం.. రీ ఎంట్రీలో సిగ్నల్ లాస్ట్..
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
* మెట్టుగూడ నుంచి మిర్జాలగూడ క్రాస్రోడ్డు, నేరేడ్మెట్ వైపు వచ్చే ప్రయాణికులు శాంతినగర్ టి జంక్షన్ వద్ద మళ్లించి జెడ్టిసి, మౌలాలి, రమాదేవి, ఇసిఐఎల్ మీదుగా లాలాపేట మీదుగా నేరేడ్మెట్కు చేరుకోవాలి.
* నేరేడ్మెట్, వినాయక్నగర్, సుఫిల్గూడ జంక్షన్ మీదుగా మల్కాజిగిరి క్రాస్ రోడ్కు వచ్చే వాహనదారులు ఆనంద్బాగ్ క్రాస్ రోడ్స్ వద్ద యూ టర్న్ తీసుకుని ఉత్తమ్నగర్, ఏసీ రూట్, సికింద్రాబాద్ మీదుగా ఉత్తమ్ ఆర్యూబీ మీదుగా బయలుదేరాలి.
* ZTC జంక్షన్ నుండి ఆనంద్ బాగ్ వచ్చే వాహనాలు ZTC వద్ద తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది.
Odisha: బీజేపీ, బీజేడీ పొత్తు ఉందా..? లేదా..?
తాజావార్తలు
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!