Odisha: బీజేపీ, బీజేడీ పొత్తు ఉందా..? లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు కూడా పొత్తుపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగి పోటీ చేస్తుందని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై పార్టీ పార్లమెంటరీ నిర్ణయమే అంతిమం అంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ గురువారం అన్నారు. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత సమాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీర్వాదం, సహకారంతో ఒడిశాలో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.
Read Also: SpaceX: ఎలాన్ మస్క్ “మెగా రాకెట్” ప్రయోగం.. రీ ఎంట్రీలో సిగ్నల్ లాస్ట్..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అయితే, ఈ ప్రకటన చేసిన రెండు గంటల తర్వాత, మా జాతీయాధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అదే తుది నిర్ణయమని, నా ప్రకటన ఆధారంగా మీడియా కథనాలు చేయకూడదని ఆయన అన్నారు. అంతకుముందు ఎక్స్లో పోస్ట్ చేసిన ‘‘ఒడిశాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’’ వ్యాఖ్యల్ని తొలగించారు. మరోవైపు బీజేడీ పార్టీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో పార్టీ సీనియర్ నేతలు గురువారం సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ ఒడిశా పర్యటన ఒక మార్చి 6న సమావేశం జరిగింది. ఈ సమయంలో BJD ఉపాధ్యక్షుడు మరియు ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా అప్పుడు బిజెపితో సాధ్యమైన పొత్తు గురించి చర్చిస్తున్నట్లు అంగీకరించారు. మార్చి 10న ఒడిశా బీజేపీ నాయకులు ఢిల్లీ వెల్లడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిందనే వార్తలు వినిపించాయి.
2008లో కంధమాల్ అల్లర్ల తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు చెదిరిపోయింది. ఎన్డీయే కూటమి నుంచి బీజేడీ వైదొలిగింది. ఈ రెండు పార్టీలు 1998-2009 వరకు 11 ఏళ్ల పాటు పొత్తు పెట్టుకున్నాయి. 2009 వరకు మూడు లోక్సభ ఎన్నికల్లో, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!