Odisha: బీజేపీ, బీజేడీ పొత్తు ఉందా..? లేదా..?
Odisha: రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు కూడా పొత్తుపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగి పోటీ చేస్తుందని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై పార్టీ పార్లమెంటరీ నిర్ణయమే అంతిమం అంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ గురువారం అన్నారు. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత సమాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీర్వాదం, సహకారంతో ఒడిశాలో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.
Read Also: SpaceX: ఎలాన్ మస్క్ “మెగా రాకెట్” ప్రయోగం.. రీ ఎంట్రీలో సిగ్నల్ లాస్ట్..
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
అయితే, ఈ ప్రకటన చేసిన రెండు గంటల తర్వాత, మా జాతీయాధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అదే తుది నిర్ణయమని, నా ప్రకటన ఆధారంగా మీడియా కథనాలు చేయకూడదని ఆయన అన్నారు. అంతకుముందు ఎక్స్లో పోస్ట్ చేసిన ‘‘ఒడిశాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’’ వ్యాఖ్యల్ని తొలగించారు. మరోవైపు బీజేడీ పార్టీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో పార్టీ సీనియర్ నేతలు గురువారం సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ ఒడిశా పర్యటన ఒక మార్చి 6న సమావేశం జరిగింది. ఈ సమయంలో BJD ఉపాధ్యక్షుడు మరియు ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా అప్పుడు బిజెపితో సాధ్యమైన పొత్తు గురించి చర్చిస్తున్నట్లు అంగీకరించారు. మార్చి 10న ఒడిశా బీజేపీ నాయకులు ఢిల్లీ వెల్లడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిందనే వార్తలు వినిపించాయి.
2008లో కంధమాల్ అల్లర్ల తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు చెదిరిపోయింది. ఎన్డీయే కూటమి నుంచి బీజేడీ వైదొలిగింది. ఈ రెండు పార్టీలు 1998-2009 వరకు 11 ఏళ్ల పాటు పొత్తు పెట్టుకున్నాయి. 2009 వరకు మూడు లోక్సభ ఎన్నికల్లో, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!