PM MODI: దీపావళికి దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి.. నమో యాప్లో సెల్ఫీలు పెట్టాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM MODI: దేశ ప్రజలకు ప్రధాని మోడీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈసారి దీపావళి సందర్భంగా దేశ ప్రజలు స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా వాటితో ఫొటోలు దిగాలని సూచించారు. ఆ చిత్రాలను నమో యాప్లో అప్లోడ్ చేయాలని హితవు కోరారు. దీంతో ప్రధాని మోడీ ఇచ్చిన స్పందనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘లోకల్ ఫర్ వోకల్’ నినాదానికి మద్దతుగా ఈ దీపావళికి దేశ ప్రజలందరూ స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దీపావళి సందర్భంగా స్థానికంగా తయారు చేసిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లోకల్ ఫర్ వోకల్ కు మద్దతుగా నిలవాలని కోరారు.
This Diwali, let us celebrate India’s entrepreneurial and creative spirit with #VocalForLocal threads on NaMo app. https://t.co/NoVknVXclo
Also Read
- Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
Buy products which have been made locally and then post a selfie with the product or the maker on the NaMo App. Invite your friends and…
— Narendra Modi (@narendramodi) November 8, 2023
ఈ దీపావళికి, ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువులతో సెల్ఫీలు తీసుకుని, వాటిని నమోయాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ఈ ఏడాది దీపావళిని భారతదేశ సృజనాత్మక స్ఫూర్తితో, వ్యాపార సామర్థ్యంతో జరుపుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. ఆ ఉత్పత్తులతో సెల్ఫీలు తీసుకుని నమో యాప్లో అప్లోడ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను చేర్చుకోవాలని పేర్కొన్నారు. స్థానిక ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి,భారతదేశ సంప్రదాయాన్ని పెంపొందించడానికి డిజిటల్ మీడియా శక్తిని ఉపయోగిస్తామని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్పై వెంటనే స్పందించారు.
పోస్ట్ చూసిన నెటిజన్లు తాము ఇప్పటికే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేశామని చెప్పారు. వాటికి సంబంధించిన చిత్రాలను కూడా అక్కడ పోస్ట్ చేశారు. గత నెలలో మన్ కీ బాత్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాను గతంలో ఇచ్చిన పిలుపు కారణంగానే దసరా పండుగకు దేశ ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశారన్నారు. ఈ స్ఫూర్తితో మన దేశంలో తయారైన ఉత్పత్తులను ప్రతి పండుగ రోజు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లోకల్ ఫర్ వోకల్ అనే నినాదానికి ఇది గొప్ప బలం చేకూరుస్తుందని ప్రధాని అన్నారు. దీనికి సంబంధించి ఈ దీపావళి పండుగ రోజున స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
Delhi AQI: ఢిల్లీలో విషపూరితంగా మారుతున్న గాలి నాణ్యత
తాజావార్తలు
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
-
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
-
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
-
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!