PM MODI: దీపావళికి దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి.. నమో యాప్లో సెల్ఫీలు పెట్టాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM MODI: దేశ ప్రజలకు ప్రధాని మోడీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈసారి దీపావళి సందర్భంగా దేశ ప్రజలు స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా వాటితో ఫొటోలు దిగాలని సూచించారు. ఆ చిత్రాలను నమో యాప్లో అప్లోడ్ చేయాలని హితవు కోరారు. దీంతో ప్రధాని మోడీ ఇచ్చిన స్పందనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘లోకల్ ఫర్ వోకల్’ నినాదానికి మద్దతుగా ఈ దీపావళికి దేశ ప్రజలందరూ స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దీపావళి సందర్భంగా స్థానికంగా తయారు చేసిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లోకల్ ఫర్ వోకల్ కు మద్దతుగా నిలవాలని కోరారు.
This Diwali, let us celebrate India’s entrepreneurial and creative spirit with #VocalForLocal threads on NaMo app. https://t.co/NoVknVXclo
Also Read
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Off The Record : సొంత ప్రభుత్వమైనా తగ్గేదే లే.. దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు!
Buy products which have been made locally and then post a selfie with the product or the maker on the NaMo App. Invite your friends and…
— Narendra Modi (@narendramodi) November 8, 2023
ఈ దీపావళికి, ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువులతో సెల్ఫీలు తీసుకుని, వాటిని నమోయాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ఈ ఏడాది దీపావళిని భారతదేశ సృజనాత్మక స్ఫూర్తితో, వ్యాపార సామర్థ్యంతో జరుపుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. ఆ ఉత్పత్తులతో సెల్ఫీలు తీసుకుని నమో యాప్లో అప్లోడ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను చేర్చుకోవాలని పేర్కొన్నారు. స్థానిక ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి,భారతదేశ సంప్రదాయాన్ని పెంపొందించడానికి డిజిటల్ మీడియా శక్తిని ఉపయోగిస్తామని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్పై వెంటనే స్పందించారు.
పోస్ట్ చూసిన నెటిజన్లు తాము ఇప్పటికే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేశామని చెప్పారు. వాటికి సంబంధించిన చిత్రాలను కూడా అక్కడ పోస్ట్ చేశారు. గత నెలలో మన్ కీ బాత్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాను గతంలో ఇచ్చిన పిలుపు కారణంగానే దసరా పండుగకు దేశ ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశారన్నారు. ఈ స్ఫూర్తితో మన దేశంలో తయారైన ఉత్పత్తులను ప్రతి పండుగ రోజు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లోకల్ ఫర్ వోకల్ అనే నినాదానికి ఇది గొప్ప బలం చేకూరుస్తుందని ప్రధాని అన్నారు. దీనికి సంబంధించి ఈ దీపావళి పండుగ రోజున స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
Delhi AQI: ఢిల్లీలో విషపూరితంగా మారుతున్న గాలి నాణ్యత
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?