Pranahitha Pushkaralu: చివరి అంకానికి ప్రాణహిత పుష్కరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించే ప్రాణహిత నది పుష్కరాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మిగిలింది మరో రెండు రోజులే కావడంతో వివిధ ప్రాంతాలనుంచి పుణ్యస్నానాలకు తరలివస్తున్నారు భక్తులు. ఇవాళ్టితో పదవ రోజుకు చేరుకున్నాయి ప్రాణహిత పుష్కరాలు. కొమురం భీం జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్ కు తరలి వస్తున్నారు భక్తులు.
ప్రాణహిత పుష్కరఘాట్లు ఇవే
తుమ్మిడిహెట్టి– కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా
Also Read
అర్జునగుట్ట–మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం
సిరోంచ – మహారాష్ట్ర
వేమనపల్లి – మంచిర్యాల జిల్లా
కాళేశ్వరం త్రివేణి సంగమం – జయశంకర్ భూపాలపల్లి జిల్లా
అలాగే, మంచిర్యాల జిల్లా అర్జున గుట్ట, వేమన పల్లి పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీ బాగా పెరిగింది. పుష్కర స్నానాలకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఘాట్లు కళకళలాడుతున్నాయి. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని (సరస్వతి) నదులు కలిసే త్రివేణి సంగమ స్థానం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా ఆంక్షలు కూడా సడలిపోవడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జున గుట్ట వద్ద ప్రాణహిత నది పుష్కరాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈనెల 13న ప్రారంభించారు. ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి.. పవిత్ర స్నానాలు చేశారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

పుష్కరాల్లో చిన్నారుల సందడి
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో నిర్వహించే ఈ పుష్కరాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఘాట్లను ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం, మహారాష్ట్ర వైపు సిరోంచలలో ఈ ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్లకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సుల్ని ఏర్పాటుచేసింది. రెండురోజుల వ్యవధి వుండడం, చివరిరోజు ఆదివారం కావడంతో భక్తులు మరింతగా పెరగవచ్చని అంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..