BJP Bike Rally: ఆందోల్ లో ప్రజాగోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajagosa-BJP Bharosa bike rally in Andol: తెలంగాణలో అధికారమే లక్షంగా బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఆందోల్ నియోజకవర్గంలోని ప్రజాగోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీని రాయికోడ్ మండలంలోని సీరూర్ గ్రామంలో మాజీమంత్రి బాబూమోహన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు జెండా ఆవిష్కరణ చేస్తూ సిరూర్ నుండి సింగీతం గ్రామం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో బీజేపీ శ్రేణులు బాబూమోహన్ మరియు జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకే ప్రజా గోస.. బీజేపీ భరోసా యాత్రను ప్రారంభించడం జరిగిందన్నారు. గత 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి నోచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటైనా నెరవేర్చిందనా అని ప్రశ్నించారు. రైతుబంధు పేరిట ఎకరాకు రూ.5వేలు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమంది ధనికులు రైతుబంధు తీసుకుంటాన్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం విడ్డూరమన్నారు. అదే బీజేపీ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని పిఎం కిసాన్ ద్వారా మూడు అఫ్తాలు రెండు వేలు నేరుగా రైతుల జమాఖాతలో పడుతాయని అన్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, తెలంగాణ వస్తే గ్రామీణ రోడ్లు అద్దాలా మారుతాయని, దళితులకు 3 ఎకరాల భూమి, దళితులను సీఎం చేస్తానని, డబుల్ బెడ్రూం, నిరుద్యోగభృతి, తదితర హామీలు గాలికి వదిలారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సీడి మీద ఎరువులు అందజేస్తుందని, గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రపంచ దేశాల్లో నెంబర్వన్గా నరేంద్రమోడీ పేరు తెచ్చుకున్నారని, అవినీతి లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లుతున్నాడని అన్నారు. తెలంగాణలో నియంత పాలన పోవాలంటే రానున్న ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!